/rtv/media/media_files/2025/01/17/TJnVuO2ZtINtE9oxNNbr.jpg)
Arvind Kejriwal and PM Modi
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అమెరికాకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి సవాలు చేశారు. అమెరికా భారత్పై 50 శాతం సుంకం విధించినందుకు ప్రతీకారంగా, భారత్ అమెరికా వస్తువులపై 75 శాతం లేదా 100 శాతం సుంకాన్ని విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
मोदी जी थोड़ी हिम्मत दिखाइए। अमेरिका पर 75% टैरिफ लगाइए फिर देखते हैं ट्रम्प झुकता है कि नहीं।
— Ravinder Bishnoi (@RavinderNadhori) September 7, 2025
—@ArvindKejriwal#TrumpTariffspic.twitter.com/Tgs0ymgWGN
ఢిల్లీలో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి దేశమంతా మద్దతుగా నిలుస్తుందని, అమెరికాపై అధిక సుంకాలు విధించడానికి ధైర్యం చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించారని, దీనికి భారత్ 75 శాతం సుంకం విధించి ధీటుగా బదులివ్వాలని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇది అవసరమని ఆయన వాదించారు. ట్రంప్ "పిరికివాడు" అని, గట్టిగా ఎదురునిలిచే దేశాల ముందు లొంగిపోతాడని కూడా కేజ్రీవాల్ అన్నారు.
అంతేకాకుండా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై కేంద్ర ప్రభుత్వం 11 శాతం దిగుమతి సుంకాన్ని మాఫీ చేయడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్ణయం భారతీయ రైతులను దెబ్బతీస్తుందని, ముఖ్యంగా గుజరాత్, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాలలోని పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుండి చౌకగా పత్తి దిగుమతి చేసుకోవడం వల్ల భారతీయ పత్తికి మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని, దీనివల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल ने कहा- 'अमेरिकी सरकार ने हीरे के ऊपर भी 50% का Tariff लगाया लेकिन मोदी सरकार Trump के दबाव में झुक गई और अमेरिका को कोई जवाब नहीं दिया. मोदी जी आप हिम्मत दिखाइए, अमेरिका से आने वाले सामान पर 75% Tariff लगाइए'#USTarrifs#ArvindKejriwal… pic.twitter.com/0hy1qAWDP5
— Zee News (@ZeeNews) September 7, 2025
అమెరికా వంటి దేశాలు సుంకాల విషయంలో ఇతర దేశాల ముందు లొంగలేదని, భారత్ కూడా అంతే ధైర్యంగా ఉండాలని కేజ్రీవాల్ అన్నారు. భారత దేశం 140 కోట్ల మంది ప్రజలున్న బలమైన దేశమని, ఏ దేశం కూడా భారత్ను కించపరచలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై పంజాబ్, గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాల రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.