రేషన్ తీసుకొనే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ | AP Govt Good News | Pawan Kalyan |CM Chandrababu
సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి , ధనుంజయరెడ్డి , బాలాజీ గోవిందప్పలను ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ వారు ఈ రోజు విచారణకు హజరుకాకపోవడం చర్చనీయంశంగా మారింది.
తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ముఖ్య విజ్ఞప్తి చేసింది. తిరుమల వీధుల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నా, భక్తులు రోడ్లపై చెత్త వేయడం వలన పరిశుభ్రతకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 30,31న ఆదివారం, సోమవారం మున్సిపాలిటీల్లో రంజాన్ సెలవులు లేవు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపులు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.
సత్యసాయి జిల్లా హిందూపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్ల వరకు టైర్ మీద పడుకుని ప్రయాణించాడు ఓ వ్యక్తి. మందు మత్తులో తన ప్రాణాలను రిస్కులో పెట్టేసుకున్నాడు. బైక్పై వెళ్లేవారు గమనించకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదంటున్నారు ప్రయాణికులు.
కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కామ దహనం కార్యక్రమంపై భక్తులు మండిపడుతున్నారు. మన్మధుడితోపాటు ఆయన వాహనమైన రామ చిలుకను దహనం చేయడాన్ని హిందూ సంఘాలు తప్పు పడుతున్నాయి.
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.