తిరుపతి లడ్డూ కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. సీబీఐ విచారణకు ఆదేశాలు
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో దర్యాప్తు జరగాలని స్పష్టం చేసింది.