POCSO Act : మైనర్‌ బాలికకు లైంగిక వేధింపులు..8మంది అరెస్ట్‌

ఆదిలాబాద్ జిల్లా గుడిహథ్నూర్ కు చెందిన ఒక బాలికకు స్నేహం పేరుతో ఓ మైనర్ బాలుడు దగ్గరయ్యాడు. ఆమెతో న్యూడ్ కాల్ చేయించి దాన్ని రికార్డు చేసి తన స్నేహితులకు షేర్ చేశాడు. దాన్ని అడ్డం పెట్టుకుని వారంతా బాలికను లైంగికంగా వేధించారు. చివరికి కటకటాల పాలయ్యారు.

New Update
The POCSO Act

The POCSO Act

POCSO Act : అరచేతిలో ప్రపంచం అంటే సాంకేతికత పెరిగి దేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ. ఆధునికత అందర్నీ అడ్డదారులు తొక్కిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ పుణ్యమా అని వయసుతో సంబంధం లేని పనులు చేస్తూ పిల్లలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీడియో గేమ్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్, బెట్టింగ్ అప్స్ లతో  కొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం న్యూడ్ కాల్స్‌, సెక్స్‌ చాట్‌ అని వయసుకు మించిన పనులు చేస్తూ కటకటాలపాలువతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోనూ అదే జరిగింది.

Also Read: వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్..నెలకు రూ.2,016 పెన్షన్‌
 
ఆదిలాబాద్ జిల్లా,గుడిహథ్నూర్ లో మైనర్ బాలికకు న్యూడ్‌ కాల్‌ చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో  కొందరు 18 సంవత్సరాల వారు కాగా, ఇద్దరు అంతకు తక్కువ వయసు వారే కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

ఆదిలాబాద్ జిల్లా,గుడిహథ్నూర్ కు చెందిన ఒక బాలికకు స్నేహం పేరుతో ఓ మైనర్ బాలుడు దగ్గరయ్యాడు. సోషల్ మీడియాలో మైనర్ బాలుడు ఆ బాలికతో ఛాటింగ్ చేశాడు. ఆ చాటింగ్ ను బాలిక తల్లిదండ్రులకు, అందరికీ తెలిసేలా చేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెతో న్యూడ్ కాల్ చేయించి, ఆ తతంగాన్ని రికార్డు చేసి, తన స్నేహితులకు షేర్ చేశాడు.  సోషల్ మీడియా వేదికగా చేసిన చాట్ ను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడు. బాలికతో వీడియో కాల్స్ మాట్లాడి.. వాటిని రికార్డ్ చేసుకుని, తన స్నేహితులతో పంచుకున్నాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని బాలుడి స్నేహితులు సైతం బాలికను వేధించడం మొదలు పెట్టారు. దీంతో చాలాకాలం మానసికంగా కృంగిపోయిన ఆ బాలిక చివరికి  ధైర్యం చేసి విషయాన్ని తల్లితండ్రులతో చెప్పింది. దీంతో వారు షీటీమ్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.

Also Read: షాకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో ప్రముఖ దర్శకుడి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..!

గుడియత్నూర్ పోలీసులు.ఇచ్చోడ పోలీసులు, షీ టీం బృందం కలిసి సంయుక్తంగా స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులలో ఇద్దరు మైనర్లు, ఆరుగురు మేజర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుండి ఏడు మొబైల్ ఫోన్‌ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.   మైనర్లను ఇద్దరినీ ప్రత్యేకంగా రిమాండ్ సీడీతో జువెనల్ కోర్ట్ జడ్జి, ఆదిలాబాద్ ముందు హాజరు పర్చారు. మిగతా ఆరుగురు  A1) సజ్జన్వార్ వంశీ కృష్ణ(20), A2) పవార్ తరుణ్(18), A3) సాబ్లే బాలవంత్ సింగ్(18),  A4) గుండల్వార్ వరుణ్(18), A5) కారడ్ సుధీర్(28), A6)ముర్కుటే విట్టల్(23) ఉన్నారు. 

Also Read: హోటల్‌లో దంపతుల శృంగారం.. కిటికీలు వేసుకోవడం మర్చిపోవడంతో..?

Advertisment
Advertisment
తాజా కథనాలు