మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Prayagraj Sangam | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. | Mahakumbh Stampede | Heavy Crowd bursts out Prayagraj Sangam of Maha Kumbhmela and this causes the death of devotees | RTV
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్న మహా కుంభ్ ప్రత్యేక రైలు పై కొందరు ప్రయాణికులు దాడి చేశారు. హర్పాల్పూర్ స్టేషన్ వద్ద రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. రైలు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో సినీ నటి మమతాకులకర్ణి సన్యాసాన్ని స్వీకరించారు. కాగా సన్యాస దీక్ష చేపట్టిన మమతాకు మహామండలేశ్వర్గా పట్టాభిషేకం చేశారు. అయితే మమతా ను మహామండలేశ్వర్గా ప్రకటించడాన్ని మహామండలేశ్వర్ హేమాంగి సఖి అభ్యంతరం తెలిపారు.
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోన్న మోనాలిసాకు భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ చిత్రంలో అవకాశం కల్పిస్తానని బాలీవుడ్కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు.
మహాకుంభమేళలో గౌతమ్ అదాని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి రోజు లక్ష మంది భక్తులకు ఉచితంగా మహా ప్రసాదం పంపిణీ చేయడానికి అదానీ గ్రూప్ కంపెనీ, ఇస్కాన్ సంస్థతో కలిసి పని చేస్తోంది. ఆయన భార్య ప్రీతి అదానీతో కలిసి మంగళవారం భక్తులకు భోజనం వడ్డించారు.
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందించనుంది. తక్కువ బడ్జెట్తో ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య కూడా చూడవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆర్టికల్పై ఓ లుక్కేయండి.