BREAKING: మహా కుంభ్ ప్రత్యేక రైలు పై రాళ్లతో దుండగుల దాడి!

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న మహా కుంభ్ ప్రత్యేక రైలు పై కొందరు ప్రయాణికులు దాడి చేశారు. హర్పాల్‌పూర్‌ స్టేషన్ వద్ద రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు. రైలు ఆలస్యం కావడంతో ఆగ్రహించిన ప్రయాణికులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

New Update
Kumbh Mela and Train

Kumbh Mela and Train

Maha Kumbh 2025: ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళకు భక్తులు పోటెత్తారు. రైల్వే స్టేషన్లు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. మహాకుంభానికి వెళ్లేందుకు  ప్రభుత్వం ప్రత్యేక రైళ్లు, బస్సులను కూడా నడుపుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ఝాన్సీ నుంచి ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న మహా కుంభ్ ప్రత్యేక రైలుపై  రాళ్ల దాడి జరగడం కలకలం రేపుతోంది. హర్పాల్‌పూర్‌ స్టేషన్ వద్ద రైలు పై రాళ్ళు విసురుతూ విధ్వంసం సృష్టించారు కొందరు ప్రయాణికులు. 

 Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!

ఆలస్యం కావడంతో.. 

అయితే ప్రయాణికులు వివరాల ప్రకారం.. ఈ రైలు నిన్న రాత్రి 8 గంటలకు ఝాన్సీ స్టేషన్ నుంచి ప్రయాగరాజ్‌కు బయలుదేరింది.  
ఈ రైలు కోసం హర్పాల్‌పూర్‌ స్టేషన్ లో ప్రయాణికులు చాలా సమయం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు.  ఝాన్సీ  నుంచి ట్రైన్  హర్పాల్‌పూర్‌ చేరుకోవడానికి సుమారు 2 గంటలు సమయం పడుతుంది. కానీ ట్రైన్ రాత్రి 2 గంటలకు  చేరుకుందట. అప్పటికీ ట్రైన్ డోర్లు తెరవకుండా అలాగే ఉంచడంతో ఆగ్రహించిన ప్రయాణికులు రైలు పై రాళ్లతో దాడి చేశారు. రాళ్లతో కిటికీలు, డోర్లు పగలగొట్టారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసి.. ప్రయాణికులు తిరిగి తమ ప్రయాణం ప్రారంభించడానికి సహాయం చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదు. 

ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
Advertisment
తాజా కథనాలు