మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం ఆదివారం జరిగిన మినీ వేలం ముగిసింది. భారత అన్క్యాప్డ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సిమ్రాన్ షేక్కు భారీ ధర పలికింది. గుజరాత్ జెయింట్స్ ఆమె కోసం రూ.1.90 కోట్లు వెచ్చించింది. వెస్టిండీస్ ఆర్రౌండర్ డియాండ్రా డాటిన్ను కూడా గుజరాత్ జెయింట్స్ రూ.1.70 కోట్లతో సొంతం చేసుకుంది. భారత్కు చెందిన 16 ఏళ్ల జి కమలిని సైతం భారీ ధర పలికింది. తమిళనాడు వికెట్కీపర్ అయిన ఈమె కనీస ధర రూ.10 లక్షల కాగా.. ఢిల్లీ, ముంబయి జట్లు పోటీ పడ్డాయి. చివరికి ముంబయి కమిలిని ఏకంగా రూ.1.60 కోట్లకు సొంతం చేసుకుంది. Also Read : Allu Arjun: విభేదాలకు చెక్.. బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి, ఫొటో వైరల్ Also Read : ఆప్ తుది జాబితా విడుదల.. కేజ్రీవాల్, అతిషి ఎక్కడి నుంచి పోటీ అంటే ? అమ్ముడుపోయిన ప్లేయర్లు వీళ్లే సిమ్రాన్ షేక్ (గుజరాత్ జెయింట్స్) - రూ. 1.90 కోట్లు డియాండ్రా డాటిన్ (గుజరాత్ జెయింట్స్) - రూ. 1.70 కోట్లు జి కమలిని (ముంబయి ఇండియన్స్) - రూ. 1.60 కోట్లు ప్రేమ రావత్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) - రూ. 1.20 కోట్లు ఎన్.చరణి (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 55 లక్షలు నాడిన్ డి క్లర్క్ (ముంబయి ఇండియన్స్) - రూ. 30 లక్షలు అలానా కింగ్ (యూపీ వారియర్స్) - రూ.30 లక్షలు డేనియల్ గిబ్సన్ (గుజరాత్ జెయింట్స్) - రూ. 30 లక్షలు అక్షితా మహేశ్వరి ( ముంబయి ఇండియన్స్) - రూ. 20 లక్షలు నందిని కశ్యప్ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 10 లక్షలు అరుషి గోయెల్ (యూపీ వారియర్స్) - రూ.10 లక్షలు క్రాంతి గౌడ్ (యూపీ వారియర్స్) - రూ.10 లక్షలు జోషిత (ఆర్సీబీ) - రూ.10 లక్షలు సంస్కృతి గుప్తా (ముంబయి ఇండియన్స్) - రూ.10 లక్షలు సారా బ్రైస్ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ.10 లక్షలు రాఘవి బిస్త్ (ఆర్సీబీ) - రూ.10 లక్షలు జాగ్రవి పవార్ (ఆర్సీబీ) - రూ.10 లక్షలు నికి ప్రసాద్ (ఢిల్లీ క్యాపిటల్స్) - రూ. 10 లక్షలు - ప్రకాశిక నాయక్ (గుజరాత్ జెయింట్స్) - రూ. 10 లక్షలు Also Read : బాలకృష్ణకు రేవంత్ సర్కార్ షాక్! Also Read : కల్తీ లడ్డూ వివాదం.. తిరుమలలో సిట్ అధికారులు!