Allu Arjun: విభేదాలకు చెక్.. బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి, ఫొటో వైరల్

అల్లు అర్జున్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు బన్నీ. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి దిగిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

New Update
bunny10

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. నేడు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి వెళ్లారు బన్నీ. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యామిలీతో చిరంజీవి దిగిన ఫొటో బయటికొచ్చింది. 

Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

ఒక్క ఫొటోతో విభేదాలకు చెక్..

ఈ ఒక్క ఫొటో ఇన్నాళ్లు మెగా - అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలంటూ వచ్చిన వార్తలన్నినింటికి పులిస్టాప్ పడేలా చేసింది. ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ.. మీరు ఎప్పుడూ ఇలాగే కలిసుండాలని కోరుకుంటున్నట్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. బన్నీ ఫ్యామిలీతో మెగాస్టార్ దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

Also Read :  2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే?

Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత చిరంజీవి సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు