/rtv/media/media_files/2025/05/04/ghOROwDcbDaVMDantcXV.jpg)
Punjab Kings
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ VS లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. దీంతో LSG ముందు 237 పరుగుల టార్గెట్ ఉంది.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
ఎవరెన్ని కొట్టారంటే?
పంజాబ్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 48 బంతుల్లో 91 పరుగులు బాదేశాడు. అందులో 6 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. అతడు త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. శ్రేయస్ కూడా హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 4 సిక్స్లు ఉన్నాయి.
శశాంక్ సింగ్ 15 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్గా మిగిలాడు. అందులో 4 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. స్టాయినిస్ 5 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అందులో 1 ఫోర్, 1 సిక్స్ ఉంది. నేహల్ వధేరా 9 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 2 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ లక్నో బౌలర్ల బౌలింగ్లో విజృంభించారు. లఖ్నవూ బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్ 2 వికెట్లు, దిగ్వేశ్ సింగ్ రాఠీ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!