IPL 2025: వేడి పెంచుతున్న ఐపీఎల్..రసవత్తరంగా మ్యాచ్ లు

టీ20లంటేనే మజా..వేగంగా సాగే ఆటతో ఫుల్ కిక్ ఇస్తుంది. అందులోనూ ఐపీఎల్ అంటే ఇంక చెప్పక్కర్లేదు. గత కొన్ని మ్యాచ్ లతో మాత్రం ఐపీఎల్ వేడెక్కింది. నిన్న సూపర్ ఓవర్ మ్యాచ్ తో అభిమానులు పండగ చేసుకున్నారు. 

New Update
list

పోతాయనకున్న జట్లు అనూహ్యంగా మ్యాచ్ లు గెలుస్తున్నాయి. టాప్ లో ఉన్న జట్లు అయితే నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఎంత భారీ స్కోర్లు కొడుతున్నా దాన్ని అవతలి జట్లు ఛేదించేస్తున్నాయి. దానికి తోడు సూపర్ ఓవర్లు ఒకటి. ఇదీ ప్రస్తుతం ఐపీఎల్ పరిస్థితి. వరుస రసవత్తర మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రతీ మ్యాచ్ టగ్ ఆఫ్ వారన్నట్టు జరుగుతుండడంతో పండగ చేసుకుంటున్నారు. 

సూపర్ ఓవర్ మ్యాచ్..

నిన్న డీసీ, ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ వేరే లెవల్ లో ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 181 పరుగుల లక్ష్యం ఇచ్చింది. అయితే డీసీ కూడా కరెక్ట్ గా అన్ని పరుగులకే ఓవర్లు పూర్తి చేసుకోవడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. దీంట్లో డీసీ అలవోగ్గా గెలిచేసి విజయాన్ని సొంతం చేసుకుంది. బౌలర్  మిచెల్‌ స్టార్క్‌ సూపర్ బౌలిక్ తో 
మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు మళ్లించాడు. సూపర్‌ ఓవర్‌లోనూ గొప్పగా బౌలింగ్‌ చేసిన స్టార్క్‌.. రాజస్థాన్‌ బ్యాటర్లు చెలరేగకుండా అడ్డుకట్ట వేశాడు. ఇదే ఢిల్లీ తేలిగ్గా గెలిచేందుకు కారణమైంది.

తలా ఫర్ ఏ రీజన్..

చెన్నై జట్టు తలా..మహేంద్ర సింగ్ ధోనీ కమ్ బ్యాక్...ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. సీఎస్కే జట్టు కెప్టెన్ కు దెబ్బ తగలడంతో జట్టు బాధ్యతలను ధోనీ తీసుకున్నాడు. అంతేకాదు లక్నోతో జరిగిన మ్యాచ్ లో దగ్గరుండి జట్టును గెలిపించాడు. తలా ఫర్ రీజన్ అనే దానిని మళ్ళ ప్రవ్ చేసుకున్నాు. మెరుపు ఇన్నింగ్స్ తో సీఎస్కే అభిమానుల కోరిక తీర్చేశాడు. దాదాపు ఓడిపోయే పరిస్థితుల నుంచి జట్టును విజయతీరాలకు నడిపించాడు మిస్టర్ కూల్. 

మ్యాచ్ అంటే ఇదీ..

ఇప్పటివరకు జరిగిన మొత్తం మ్యాచ్ లలో అత్యంత మజా ఇచ్చినది కోలకత్తా నైట్ రైడర్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్. టీ20లంటేనే వీరబాదుడు. కానీ అలాంటి చోట కేవలం 111 పరుగుల మాత్రమే చేయడం..దాన్ని కూడా అవతలి జట్టు కొట్టేయకుండా కాపాడుకోవడం ఒక్క పంజాబ్ కే చెల్లింది. విజయానికి ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి నుంచి.. పంజాబ్‌ మ్యాచ్‌ను చేజిక్కించుకున్న తీరు అద్భుతం.  బంతితో మాయ చేసి కోలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్లను బురిడీ కొట్టించారు పంజాబ్ బౌలర్లు. కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశారు. అందుకే ఇది 
మ్యాచ్‌ ఆఫ్‌ ద ఐపీఎల్‌గా నిలిచిపోయింది. లీగ్‌ చరిత్రలో స్వల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా పంజాజ్‌ ఘనత సాధించింది. లెగ్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్, పేసర్‌ యాన్సెన్‌ బౌలింగ్ అయితే చూసి తీరాల్సిందే. 

ప్రస్తుతం ఐపీఎల్ సాగుతున్న విధానం చూస్తుంటే ిలాంటి అద్భుతాలు..మజా ఇచ్చే మ్యాచ్ లు మరిన్ని జరుగుతాయని అనిపిస్తోంది. ప్లే ఆఫ్స్ మొదలైతే మరింత రసవత్తరంగా ఉంటాయని తెలుస్తోంది. 

today-latest-news-in-telugu | IPL 2025 | cricket | t20 | match

Also Read: Vice President: రాష్ట్రపతికి కోర్టు డెడ్ లైన్ విధించడమేంటి..ఉపరాష్ట్రపతి

Advertisment
Advertisment
తాజా కథనాలు