virat kohli : ఇదిరా కోహ్లి అంటే.. విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఒక దేవుడు. సచిన్ లాంటి ఆటగాడిని మళ్లీ టీమిండియా చూస్తుందా అనుకున్న టైమ్ లో భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఓ వరం విరాట్ కోహ్లి. విరాట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.

New Update
virat-kohli-18

ఇండియాలో క్రికెట్ ఒక మతం అయితే సచిన్ ఒక దేవుడు. సచిన్ లాంటి ఆటగాడిని మళ్లీ టీమిండియా చూస్తుందా అనుకున్న టైమ్ లో భారత క్రికెట్ జట్టుకు దొరికిన ఓ వరం విరాట్ కోహ్లి.. 1988 నవంబర్ 5వ తేదీన ఢిల్లీలోని  ఓ పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు కోహ్లి.  అతని తల్లి సరోజ్ కోహ్లీ గృహిణి కాగా, తండ్రి ప్రేమ్ నాథ్ కోహ్లీ క్రిమినల్ న్యాయవాదిగా పనిచేశాడు. అతనికి అన్నయ్య వికాస్, అక్క భావన ఉన్నారు. కోహ్లి బాల్యం ఉత్తమ్ నగర్‌లో గడిచింది .  కోహ్లీ 3 సంవత్సరాల వయస్సులోనే బ్యా్ట్ పట్టుకున్న కోహ్లి తన తండ్రికి బౌలింగ్ వేయమని కోరేవాడు. 

 స్కూల్ అయిపోయాక క్రికెట్ ఆడటం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు.  అలా అడుతున్నప్పుడు అతని ఆటను గమనించిన కోహ్లి తండ్రి  అతనికి క్రికెట్ శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు.  1998లో  కోహ్లికి 9 సంవత్సరాల వయసున్నప్పుడు  రాజ్ కుమార్ శర్మ దగ్గర ట్రైనింగ్ కు చేర్పించారు. క్రికెట్ మీద కోహ్లికి ఉన్న ఇంట్రెస్ట్, డెడికేషన్ కు  2002అక్టోబర్ లో  అండర్ 15 జట్టుకు ఎంపికయ్యాడు.  ఆ జట్టు తరుపున 2002,03లో జరిగిన టోర్నమెంట్ లో ఒక్కో ఇన్నింగ్స్ లో 172 పరుగులు చేశాడు.  దీని ద్వారా అండర్ 17లో చోటు దక్కించుకున్నాడు.  ఇవన్ని చూసి కోహ్లిని 2006 ఫిబ్రవరిలో ఢిల్లీ తరుపున ఆడేందుకు లిస్టులో చేర్చారు.  కానీ అందులో కోహ్లి అనుకున్నంతగా రాణించలేకపోయాడు.  

2006 జూలైలో అండర్ 19 ఇంగ్లండ్ టూర్ కోసం కోహ్లిని ఎంపిక చేశారు సెలక్టర్లు. ఈ టోర్నమెంట్ లో  మూడు మ్యాచ్ లలో 105 పరుగులు చేశాడు.  అప్పటివరకు ఇంగ్లండ్ పిచ్ లపై ఆడటం అనేది ఓ గొప్ప విషయం కానీ కోహ్లి అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు.  అతని ఆటకు అండర్ 19 కోచ్ లాల్ చంద్ రాజ్ పుత్ చాలా ఇంప్రెస్ అయ్యాడు.  ఇతడు అప్పుడే మంచి క్రికెటర్ అవుతాడని బాగా నమ్మాడు. ఇదే సమయంలో తన తండ్రి చేసిన వ్యాపారంలో బాగా నష్టాలు రావడంతో కోహ్లీ కుటుంబం సొంతింటి నుంచి అద్దెంటికి మారాల్సి వచ్చింది.  అయినప్పటికీ కోహ్లీ మాత్రం తన బాధలన్ని మర్చిపోయి క్రికెట్ పైనే ఫోకస్ చేసేవాడు.  

Also Read :  ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు

2006 డిసెంబర్ 17వ తేదీన రంజీ ట్రోఫిలో ఢిల్లీ తరుపున కర్ణాటతో జరిగిన మ్యాచ్ లో కోహ్లి ఆట అంటే ప్రపంచానికి తెలిసింది.  ఈ మ్యాచ్ జరుగుతున్న టైమ్ లోనే కోహ్లి తండ్రి చనిపోయిన విషయం తెలిసింది. ఓ పక్కా తండ్రి చనిపోయిన వార్త మరోపక్కా ఢిల్లీ మ్యాచ్.. బాధను ఏ మాత్రం బయటకు కనిపించకుండా బ్యాట్ పట్టుకుని 90 పరుగులు చేసి జట్టును గెలిపించి ఆ తరువాత తండ్రి అంత్యక్రియలకు వెళ్లాడు. అప్పుడు కోహ్లి వయసు 18 ఏళ్లు. ఈ ఒక్క సంఘటన చాలు కోహ్లికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అంటే ఎంత డెడికేషనో.  

ఏడస్తూ కూర్చుంటే  ఏం సాధించలేం..తన తండ్రి తనను గొప్ప క్రికెటర్ గా చూడాలనుకున్నారు. అదే ఆయనకు తానిచ్చే నిజమైన నివాళి అని నిరంతరం కష్టపడ్డాడు కోహ్లి.  2008లో మలేషియాలో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ కు భారత తరుపున  కెప్టెన్ గా కోహ్లి ఎంపికయ్యాడు.  అందులో నాలుగో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగిన కోహ్లి..  ఆరు మ్యాచ్ లలో 235 పరుగులు సాధించి విజయాలలో కీ రోల్ పోషించాడు. అతని ఆటకు ఫిదా అయిపోయిన ఆర్సీబీ జట్టు 30 వేల డాలర్లకు కోహ్లిని కొనుగోలు చేసింది.  అదే ఏడాది కూడా టీమిండియా  జట్టకు కోహ్లి ఎంపికయ్యాడు.  

మొదటి వన్డేను శ్రీలంకతో ఆడాడు కోహ్లి.  2011లో ఆస్ట్రేలియాతో టెస్టు అరంగ్రేటం చేశాడు. జింబాబ్వేపై తొలి టీ20 ఆడాడు .ఆడిన ప్రతి మ్యాచ్ లో సెంచరీనే.. కోహ్లి క్రిజులో ఉంటే మ్యాచ్  గెలిచనట్టే అనే నమ్మకాన్ని కల్పించాడు. 2011 ప్రపంచ కప్ సమయంలో , అతను తన వరల్డ్ కప్  అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.   

Also Read :  RCB సంబరాల్లో తొక్కిసలాట.. 11మంది స్పాట్ డెడ్.. 50 మందికి పైగా గాయాలు - షాకింగ్ వీడియోలు

2012 పాకిస్తా్న్ తో జరిగిన ట్రోఫికి వైస్ కెప్టెన్ గా ఎంపికై 183 పరుగులు చేసి లారా పేరిట ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు.  2013లో వెస్టిండిస్ తో జరిగిన సిరీస్ కు ధోనీకి గాయం కావడంతో మొదటిసారి కోహ్లి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కోహ్లిని అన్నీ ఫార్మట్లకు కెప్టెన్ గా నియమించారు. 

కెప్టెన్ గా టీమ్ ను ముందుకు నడిపిస్తూనే ఆటగాడిగా కోహ్లి చేసిన ప్రదర్శన సచిన్ అంతటివాడిని చేసింది.  వన్డేలో  అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన మొదటి ఇండియన్ క్రికెటర్ గా, ప్రపంచంలో   అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన మొదటి  ఆటగాడిగా, అత్యంత వేగంగా 35 సెంచరీలు చేసిన ఆటగాడిగా, మూడు ఫార్మట్లలో 50కి పైగా యావరేజ్ ఉన్న ఏకైక వరల్డ్ క్రికెటర్ గా కోహ్లి నిలిచాడు.  క్రికెట్ లో కోహ్లి ప్రదర్శనకు గానూ 2013లో అర్జున అవార్డు, 2017లో పద్మశ్రీ అవార్డు, 2018 రాజీవ్ గాంధీ ఖేల్ రత్నతో పాటుగా ఐసీసీ అవార్డులను గెలుచుకున్నాడు.  

బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి  2017లో ఇటలీలో పెళ్లి చేసుకున్నాడు.  వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. విరాట్ కంటే అనుష్కఅరు నెలలు పెద్దది. అనుష్కతో పెళ్లి అయ్యాకే కోహ్లీ ఆట తగ్గిందన్న విమర్శలు ఎదురుకున్నాడు.  కానీ అనుష్కే తన బలమని కోహ్లి పలుమార్లు చెప్పుకొచ్చాడు.  2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచాక రిటైర్ మెంట్ ప్రకటించారు.  2025లో టెస్టులకు   రిటైర్ మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం వన్టే, ఐపీఎల్ లో మాత్రమే కోహ్లి కనిపించనున్నారు. ఆటగాడిగా ఎన్నో విజయాలు అవార్డులు చూసిన కోహ్లి కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయాడన్న విమర్శలు ఎదురుకున్నాడు.  

Also Read :  పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన PSPK.. కారణం అదే.. ?

కోహ్లీ గురించి మరిన్ని విషయాలు 

కోహ్లీ కెరీర్‌లో ఐపీఎల్ ట్రోఫీ 2025 ముందువరకు  గెలవలేకపోయినా, అతను చాలాసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 
ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో అతను ఒకడు.
అతను ఒకే వేదిక (ఎం.చిన్నస్వామి స్టేడియం)లో 3000 IPL పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీల జాబితాలో కోహ్లీ (63) రెండవ స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, భారతదేశం ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.
అతను వేసిన జీరో బంతికి వికెట్ తీసిన ఏకైక బౌలర్ కూడా ఇతనే.
ఒకే జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు (శ్రీలంకపై 10) చేసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు.
ఒకే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు (2023లో 765) చేసిన రికార్డును భారత బ్యాట్స్‌మన్ కలిగి ఉన్నాడు.
వరుసగా మూడు టెస్ట్ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడు కోహ్లీ 
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు (6) చేసిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు.
కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించాడు. 
అనిల్ కుంబ్లేతో విబేధాలున్నాయని టాక్ 
విరాట్ కోహ్లీ నికర విలువ ₹1,050 కోట్లు ఉంటుందని టాక్ 
గురుగ్రామ్‌లో రూ. 80 కోట్ల విలువైన భవనం, రూ. 34 కోట్ల విలువైన ముంబైలో అపార్ట్‌మెంట్ ఉంది.  
భారత క్రికెట్ జట్టు (BCCI)లో A+ గ్రేడ్ ఆటగాడిగా కోహ్లి ఉన్నాడు, అతను వార్షిక జీతం రూ. 7 కోట్లు సంపాదిస్తాడు.అంతేకాకుండా మ్యాచ్ ఫీజు కూడా అందుకుంటాడు: టెస్ట్‌కు రూ.15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు. టీ20Iకి రూ.  3 లక్షలు. 
కోహ్లీ ఒక్కో యాడ్ కు రూ.7.50 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు తీసుకుంటాడు.

Also Read :  ఒంగోలులో సంబరాలు.. కూటమి ప్రభుత్వ విజయానికి ఏడాది వేడుకలు

 

Virat Kohli | IPL 2025 | rcb | Royal Challengers Bangalore

Advertisment
Advertisment
తాజా కథనాలు