/rtv/media/media_files/2025/06/04/W4w99qRlsIxGJylV40vy.jpg)
pawan kalyan returns harihara veeramallu advance remuneration
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను నటిస్తు్న్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా విషయంలో పవన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రం కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్ను తిరిగి నిర్మాత ఏఎం రత్నంకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి పవన్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఇంతకీ పవన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? దానికి గల కారణం ఏంటి? అనే విషయానికొస్తే..
Also Read: రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి
పవన్ గొప్ప మనసు
పవన్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. క్రిష్ డైరెక్షన్లో ఈ చిత్రం మొదలైంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం 2020లో అధికారికంగా ప్రారంభమైంది. ఇక పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ సినిమాకు మధ్యలో బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమా దాదాపు ఐదేళ్లుగా రిలీజ్ కోసం కష్టాలు పడుతూ వస్తుంది.
Also Read: టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ఇన్నేళ్లైన నిర్మాత రత్నం తన పట్టు విడువలేదు. ఎంత ఖర్చు అయినా పెడుతూనే ఉన్నాడు. రీషూట్స్, సీజీ వర్క్, లోకేషన్స్.. ఇలా దేనికైతే దానికి బాగా ఖర్చు చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ ఒకెత్తయితే సినిమా రిలీజ్ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు గొడవ. వీటన్నింటిని బరిస్తూ ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
Also Read: ఆశావర్కర్పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
అయితే ఈ సినిమా పట్టాలెక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు సెట్స్ పైనే ఉండటంతో నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ఇది కాస్త ప్రొడ్యూసర్ రత్నంకు అదనపు భారాన్ని మోపింది. వీటన్నింటినీ అర్థం చేసుకున్న పవన్ కల్యాణ్ తన గొప్ప మనసు చాటుకున్నారు. తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి నిర్మాత రత్నంకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిబట్టి చూస్తే పవన్ ‘హరిహర వీరమల్లు’ కోసం ఒక్కరూపాయి తీసుకోలేదన్నమాట.
Also Read: చౌటుప్పల్ వద్ద ఘోరం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్ - 20 మంది!
Pawan Kalyan | Hari Hara Veera Mallu | Producer AM Ratnam