/rtv/media/media_files/2025/06/01/Bm7wHeGHmdAlknxeTSxc.jpg)
Rinku Singh and Priya Saroj
టీమిండియా యంగ్ క్రికెటర్ రింకు సింగ్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పబోతున్నాడు. అతడు త్వరలో పెళ్లిచేసుకోబోతున్నాడు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఏడడుగులు వేయబోతున్నాడు. తాజాగా వీరిద్దరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. రింకు సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం జూన్ 8న జరగబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : ‘కన్నప్ప’ హార్డ్ డిస్క్పై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
Rinku Singh Engagement
లక్నోలోని సెవెన్ స్టార్ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరగబోతుందని సమాచారం. అలాగే నవంబర్ 18న వారణాసిలోని ఒక పెద్ద హోటల్ తాజ్లో గ్రాండ్గా వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇదే విషయంపై ఇటీవల ప్రియ తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ స్పందించారు. రింకు, ప్రియకు సంవత్సరం ముందు నుంచే పరిచయం ఉందని ఆయన గతంలో తెలిపారు. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. వారి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయని పేర్కొన్నారు.
Also Read : ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా - పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
ఇక నవంబర్లో జరిగే వీరి వివాహానికి రాజకీయ ప్రముఖులు, సినీ స్టార్లు, క్రికెటర్లు, బిజినెస్మ్యాన్లు భారీ స్థాయిలో హాజరు అవుతారని సమాచారం. కాగా ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు, ఉత్తరప్రదేశ్ నుండి ప్రస్తుత సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే. మరోవైపు ప్రియ సరోజ్ గతంలో సుప్రీం కోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని మచిలీషహర్ నుంచి ఎస్పీ పార్టీ తరఫున పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇకపోతే రింకూ సింగ్ టీమిండియాలో యువ క్రికెటర్గా కొనసాగుతున్నాడు.
Also Read : ఇరాన్ లో ముగ్గురు ఇండియన్స్ కిడ్నాప్..పాకిస్తాన్ నంబర్ నుంచి డబ్బులు?
Also Read: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్స్ ఎప్పుడంటే?