/rtv/media/media_files/2025/05/31/2YYg9ZJ7JezDBuYExIdQ.jpg)
Indians Missing In Iran
ఇరాన్ లో మిస్ అయిన ఇండియన్స్ గురించి ఇప్పుడు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అదృశ్యమైన వ్యక్తుల్ని ఐఎస్ఐ భారత్ గూఢచారులుగా చిత్రీకరించడానికి ప్రయత్నించవచ్చని నివేదిక సూచిస్తున్నాయి. వీరు ముగ్గురూ ఏజెంట్లను నమ్మి మోసపోయారని తెలుస్తోంది. బాధితులను ఇరాన్ ద్వారా ఆస్ట్రేలియా పంపుతామని చెప్పారు. కానీ ఇరాన్ వెళ్ళాక వాళ్ళు కనిపించకుండా పోయారు. హోషియార్పూర్ లో ఉన్న ఈ ఏజెంట్ ప్రస్తుతం కనిపించకుండాపోయాడు.
పాకిస్తాన్ హస్తం ఉందా..
ఇప్పుడు ముగ్గురు భారతీయుల మిస్సింగ్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంగ్రూర్కు చెందిన హుషాన్ప్రీత్ సింగ్, ఎస్బిఎస్ నగర్కు చెందిన జస్పాల్ సింగ్, పంజాబ్లోని హోషియార్పూర్కు చెందిన అమృత్పాల్ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు మే 1న టెహ్రాన్తో దిగిన కొద్దిసేపటికి అదృశ్యమయ్యారు.ఈ ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు పాకిస్తాన్ నెంబర్ల నుంచి డబ్బుల కోసం రావడంతో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రమేయం ఉందేమోనని అంటున్నారు. దీంతో కనిపించకుండా పోయిన ఏజెంట్ కు పాకిస్తాన్ ప్రభుత్వం లేదా ఐఎస్ఐతో ఏవైనా సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి కూడా దర్యాప్తు జరుగుతోంది.
Also Read: GAZA: గాజాలో మిన్నంటుతున్న ఆకలి కేకలు..77 ట్రక్కులపై వేలాది మంది దాడి