ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ మార్చి 9న గ్రాండ్ లెవెల్లో జరగనుంది. భారత్ vs న్యూజిలాండ్ చివరాఖరి పోరుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో భారత్ జట్టులో ఎక్కువ సార్లు ప్లేస్లు మారింది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. జట్టుకు ఏ సమయంలో అతడు అవసరం అవుతాడో.. అప్పుడు ఒక యోధుడిలా తానునున్నానంటూ ముందుకొస్తాడు.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
ఓపెనింగ్, 3,4,5,6 స్థానంలో కూడా అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా జట్టును ఓటమి ఊబిలోంచి బయటపడేశాడు. అతడి ఆటతీరుపై తాజాగా భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు రావడం జట్టు బలాన్ని మరింత పెంచిందన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా అతడు బ్యాటింగ్ ఆర్డర్ మారడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.
పరిస్థితులకు అనుగుణంగా రాహుల్
గతంలో రాహుల్ పరిస్థితులకు అనుగుణంగా ఓపెనింగ్ నుంచి 5వ స్థానం వరకు బ్యాటింగ్ చేశాడని.. ఇప్పుడు 6వ స్థానంలో బరిలోకి దిగుతున్నాడని.. అయితే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా త్వరగానే అలవాటు పడతాడని కొనియాడాడు. అతడు తన పాత్ర పట్ల సంతోషంగా ఉంటాడు అని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్కు దిగడం అతనికే మేలు చేస్తోందని చెప్పుకొచ్చాడు.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
అతడు అలా బ్యాటింగ్ స్థానాలకు దిగడం టీమిండియాకు సైతం ఎంతో ఉపయోగకరం అని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. టీమ్లో రోహిత్, కోహ్లీ, హార్దిక్, షమీ, జడేజా వంటి సీనియర్ ప్లేయర్లు ఉండటం వల్ల ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోగలదని అతడు తెలిపాడు. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు జట్టుకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుండటం ఎంతో మేలైన పద్దతి అని చెప్పుకొచ్చారు.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ!
Champions Trophy 2025: రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్పై కోచ్ సంచలన వ్యాఖ్యలు!
కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసించాడు. అతను ఆరోస్థానంలో బ్యాటింగ్కు మారడం జట్టు బలాన్ని మరింత పెంచుతుందన్నారు. పరిస్థితులకు తగ్గట్టు అతడు ఓపెనింగ్, 4, 5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
Sitanshu Kotak interesting comments on KL Rahul batting order in champions trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ మార్చి 9న గ్రాండ్ లెవెల్లో జరగనుంది. భారత్ vs న్యూజిలాండ్ చివరాఖరి పోరుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో భారత్ జట్టులో ఎక్కువ సార్లు ప్లేస్లు మారింది ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. జట్టుకు ఏ సమయంలో అతడు అవసరం అవుతాడో.. అప్పుడు ఒక యోధుడిలా తానునున్నానంటూ ముందుకొస్తాడు.
Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
ఓపెనింగ్, 3,4,5,6 స్థానంలో కూడా అతడు బ్యాటింగ్ చేస్తాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా జట్టును ఓటమి ఊబిలోంచి బయటపడేశాడు. అతడి ఆటతీరుపై తాజాగా భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్ష్ కోటక్ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు రావడం జట్టు బలాన్ని మరింత పెంచిందన్నాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా అతడు బ్యాటింగ్ ఆర్డర్ మారడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.
Also Read: ఇదెక్కడి అరాచకం.. బట్టలు విప్పి విమానంలో రచ్చ రచ్చ చేసిన మహిళ.. వీడియో చూశారా?
పరిస్థితులకు అనుగుణంగా రాహుల్
గతంలో రాహుల్ పరిస్థితులకు అనుగుణంగా ఓపెనింగ్ నుంచి 5వ స్థానం వరకు బ్యాటింగ్ చేశాడని.. ఇప్పుడు 6వ స్థానంలో బరిలోకి దిగుతున్నాడని.. అయితే అతడు ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగినా త్వరగానే అలవాటు పడతాడని కొనియాడాడు. అతడు తన పాత్ర పట్ల సంతోషంగా ఉంటాడు అని అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్కు దిగడం అతనికే మేలు చేస్తోందని చెప్పుకొచ్చాడు.
Also Read: మందుబాబులకు మరో బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న బీర్ల ధరలు.. ఈ సారి ఎంతంటే?
అతడు అలా బ్యాటింగ్ స్థానాలకు దిగడం టీమిండియాకు సైతం ఎంతో ఉపయోగకరం అని అన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. టీమ్లో రోహిత్, కోహ్లీ, హార్దిక్, షమీ, జడేజా వంటి సీనియర్ ప్లేయర్లు ఉండటం వల్ల ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోగలదని అతడు తెలిపాడు. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు జట్టుకు సంబంధించిన విషయాల గురించి చర్చిస్తుండటం ఎంతో మేలైన పద్దతి అని చెప్పుకొచ్చారు.
Also Read: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ!