/rtv/media/media_files/2025/04/19/7rEZXrKASaKvJMJx3C8C.jpg)
GT vs DC IPL 2025
గుజరాత్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు ముందు 204 టార్గెట్ ఉంది. అక్షర్ పటేల్ (39), అశుతోష్ శర్మ (37), కరుణ్ నాయర్ (31), ట్రిస్టన్ స్టబ్స్ (31) బ్యాటింగ్లో రాణించారు. కేఎల్ రాహుల్ (28) ఫర్వాలేదనిపించాడు.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
టాస్ గెలిచి బ్యాటింగ్కు ఢిల్లీ జట్టు
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఓపెనర్లుగా అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్ క్రీజ్లోకి వచ్చారు. మొదటి నుంచి దూకుడుగా ఆడుతున్నారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో అభిషేక్ విజృంభించాడు. ఏకంగా మొదటి ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. అయితే అభిషేక్ దూకుడు ఎక్కువ సమయంలో నిలవలేకపోయాడు. 9 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చాడు. అతడు కూడా దూకుడుగా ఆడాడు. అయితే బౌలర్ ప్రసిద్ధ్ సూపర్ యార్కర్ వేయడంతో కేఎల్ రాహుల్ (28) ఔటయ్యాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజ్లో అక్షర్ పటేల్ వచ్చాడు. మరోవైపు కరుణ్ నాయర్ వేగంగా ఆడుతున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.
7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు రాబట్టారు. నిలకడగా ఆడుతున్నారు అనుకున్న సమయంలో కరుణ్ నాయర్ (31) పెవిలిన్బాట పట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 10 ఓవర్లలో ఢిల్లీ జట్టు 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. క్రీజ్లో అక్షర్ పటేల్, స్టబ్స్ నిలకడగా ఆడారు. 12 ఓవర్లలో 122 పరుగులు సాధించారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
ఇలా ఓ వైపు క్రీజులో అక్షర్ పటేల్, మరోవైపు స్టబ్స్ ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబట్టారు. పర్వాలేదు అనుకుంటున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్లో స్టబ్స్ (31) ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో ఢిల్లీ జట్టు 15 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశుతోష్ శర్మ మంచి ఫామ్ కనబరిచాడు.
అంతలోనే ఢిల్లీ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అక్షర్ పటేల్ కాలికి తీవ్ర గాయం అయింది. దీంతో వైద్యుడు గ్రౌండ్లోకి వచ్చి అతడికి ట్రీట్మెండ్ చేశాడు. అలా మెల్లి మెల్లిగా ఆడుతున్న క్రమంలో అక్షర్ పటేల్ (39) ఔటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వికెట్ కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 5 వికెట్ను ఢిల్లీ జట్టు కోల్పోయింది.
ఆ తర్వాత వెంటనే ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో విప్రరాజ్ నిగమ్.. వికెట్ కీపర్ జోస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. ఇలా 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం ఇషాంత్ శర్మ బౌలింగ్లో ఏడో వికెట్ కోల్పోయింది. డొనొవన్ ఫెర్రీరా (1) ఔటయ్యాడు. దీంతో 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించింది. తర్వాత అశుతోశ్ శర్మ (37) పెవిలియన్కు చేరాడు. ఇలా మొత్తంగా ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
IPL 2025 | sports-news | GT vs DC IPL 2025