/rtv/media/media_files/2025/10/19/eng-vs-ind-2025-10-19-14-52-24.jpg)
ENG vs IND: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఇండోర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అంటే భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుందన్నమాట. సెమీ-ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. జట్టులో జెమిమా రోడ్రిగ్స్ స్థానంలో సీనియర్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్ను తీసుకున్నారు. ఇంగ్లాండ్ జట్టులో సోఫీ ఎకెల్స్టోన్, లారెన్ బెల్ తిరిగి వచ్చారు. సెమీఫైనల్ బెర్త్ కోసం ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
India Women have been asked to bowl first in a must win game.#indvseng#CWC25pic.twitter.com/ADd2z9wBro
— CREX (@Crex_live) October 19, 2025
ఇది కూడా చదవండి: గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
తుది జట్లు
భారత్: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్జోత్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్
ఇది కూడా చదవండి: తెల్లటి ఆహార పదార్థాలు విషమా లేక అమృతమా..!!
ఇంగ్లాండ్: అమీ జోన్స్, టామీ బీమౌంట్, హీదర్ నైట్, నాట్ స్కివర్ (కెప్టెన్), సోఫియా డంక్లే, కాప్సీ, లాంబ్, డీన్, సోఫీ, స్మిత్, బెల్