Cricket: ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ స్క్వాడ్ ప్రకటన

ఐపీఎల్ తర్వాత భారత క్రికెట్ జట్టు వెళ్ళబోయే ఇంగ్లాండ్ టూర్ కు ఈరోజు ఏ స్క్వాడ్ ను బీసీసీై ప్రకటించింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో కరుణ నాయర్, ఇషాన్ కిషన్ లకు చోటు దక్కింది. అలాగే వికెట్ కీపర్ ధ్రువ్ జ్యురెల్ కూడా అవకాశం దక్కించుకున్నాడు. 

New Update
cricket

India A Squad For England Tour

సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వరుసగా టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లాండ్ టూర్ కు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అందరిలో ఉత్కంఠత నెలకొంది. అయితే మెయిన్ టీమ్ ను ఇంకా ప్రకటించినప్పటికీ.. ఇంగ్లాండ్ టూర్ కు ఇండియా ఏ స్క్వాడ్ జాబితాను ఈరోజు బీసీసీఐ ప్రకటించింది. 20 మందితో కూడిన ప్లేయర్ల లిస్ట్ ను అనౌన్స్ చేసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలెక్షన్ కమిటీ దీనిపై కసరత్తులు చేసింది. 20 మందితో కూడిన ఈ జాబితాలో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్ కు ఛాన్స్ దక్కింది. పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న ఇషాన్ కిషన్ కు సైతం సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. అభిమన్యు ఈశ్వరన్ ఈ జట్టుకు కెప్టెన్ గా చేయనున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. 20 మందితో కూడిన స్క్వాడ్ లో టెస్ట్ రెగ్యులర్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ కూడా ఉన్నారు.  

cricket
India A squad

 

ఇక బౌలర్లలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్లు  నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయం కారణంగా ఐపీఎల్ 2025 కు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇండియా ఏ స్క్వాడ్ కు సెలక్టయ్యాడు. ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్లుగా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక కొత్త ఆటగాళ్లల్లో బౌలర్ మానవ్ సుతార్ తో పాటు  తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దుబే వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లను కూడా సెలక్ట్ చేశారు. ఈ మొత్తం ఆటగాళ్ళల్లో శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లో రెండో మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. 

today-latest-news-in-telugu | test | team | england 

Also Read: Salman Rushdie: సల్మాన్ రష్దీపై హత్యాయత్నం నిందితుడికి 25 ఏళ్ళ జైలు శిక్ష

Advertisment
Advertisment
తాజా కథనాలు