తెలంగాణ సాధన కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్..సీఎం కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి!
తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా, స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్..తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు కేసీఆర్ ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు.