movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్​ కన్నప్ప పట్టాలెక్కడానికి రెడీ అయింది. ఇందులో మహాశివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా...అతని సరసన పార్వతిగా నయనతార కనిపించనుంది. దీంతో పదహారేళ్ళ తర్వాత ప్రభాస్-నయన్ మళ్ళీ కలిసినటిస్తున్నారు.

New Update
movies: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార

మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. స్టార్ ప్లస్ లో మహాభారత్ సీరియల్ తీసిన ముఖేశ్​ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో కన్నప్ప పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోంది. డైలాగ్ కింగ్​ మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్పగా నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్​లో కనిపించనున్నారు. అది కూడా శివుడి పాత్రలో అని ప్రచారం సాగగా.. మంచు విష్ణు కూడా ఓ ట్వీట్​తో ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.

అయితే ఇప్పుడిదే సినిమాలో నయనతార కూడా యాక్ట్ చేయనుందని తెలిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ నటి మధు బాల కన్ఫామ్ చేశారు. ఆమె తన కొత్త సినిమాల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్-నయతార ప్రాజెక్ట్ లో భాగమయ్యానని చెప్పారు. దీంతో ప్రభాస్ శివుడి పాత్రకు జోడీగా నయన్​ పార్వతిగా కనిపించనుందని బయట టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట నూపుర్ సనన్ ఎంపిక చేశారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది.

యోగి సినిమా తర్వాత అంటే.. దాదాపు 16ఏళ్ల తర్వాత కలిసి మళ్లీ ప్రభాస్-నయన్​ నటిస్తున్నారు. కాగా, ఇప్పటికే నయన్​.. పలు సినిమాల్లో అమ్మవారిగా కనిపించి ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇకపోతే కన్నప్ప చిత్రం విషయానికొస్తే.. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని రూపొందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి స్వరాలు సమకూరుస్తున్నారు.

కన్నప్ప సినిమా మొత్తాన్ని న్యూజిలాండ్ లో జరగనుంది. ఒక్క షెడ్యూల్ లో మొత్తం సినిమాను పూర్తి చేస్తామని మంచు విష్ణు ఆల్రెడీ ప్రకటించారు. రీసెంట్ గా 800 మంది సిబ్బందితో 5 నెలల పాటూ ఆర్ట్ వర్క్ పూర్తి చేయించినట్లు విష్ణు చెప్పారు. దీనికి సంబంధించిన మొత్తం సామాగ్రిని 8 కంటెయినర్లలో న్యూజిలాండ్ కు తరలించారు. ఈ ఆర్ట్ వర్క్ కు సంబంధించి మేకింగ్ వీడియోను మూవీ టీమ్ సోషల్ మీడియాలో కూడా పంచుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

#AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఈ ప్రాజెక్ట్ లో బాగమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ, మృణాల్ ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update

#AA22xA6:  అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై  పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇప్పటికే ఈమూవీలో అల్లు అర్జున్ జోడీగా మృణాల్, జాన్వీ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. 

ముగ్గురు హీరోయిన్లు 

 తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ  జోడీగా మెరవనున్నట్లు సమాచారం.  అల్లు అర్జున్, దీపికా, అట్లీ పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికా ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే ఇటీవలే  ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగాయి.  బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.

telugu-news | cinema-news | latest-news | Allu Arjun – Atlee Allu Arjun – Atlee 

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Advertisment
Advertisment
Advertisment