BAISAKHI BUMPER LOTTERY: ముసలోడే కాని మహానుభావుడు.. 2గంటల్లో రూ.6 కోట్ల జాక్ పాట్ కొట్టిన కూరగాయల వ్యాపారి!

పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా కక్కోన్ గ్రామానికి చెందిన తర్సేమ్ లాల్‌(68)కు అదృష్టం వరించింది. రూ.500తో లాటరీ టికెట్ కొంటే.. 2 గంటల్లోనే రూ.6 కోట్ల జాక్ పాట్ తగిలింది. దీంతో కూరగాయల వ్యాపారం చేస్తూ అద్దెంట్లో ఉంటున్న అతడు కొత్తిళ్లు కొనుక్కుంటానన్నాడు.

New Update
BAISAKHI BUMPER LOTTERY

BAISAKHI BUMPER LOTTERY

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవ్వరికీ తెలియదు. అది వరించిన నాడు.. ఆనందానికి అవదులే ఉండవు. అలాంటి అవధుల్లేని ఆనందంలో ఇప్పుడు ఓ కూరగాయల వ్యాపారి మునిగి తేలుతున్నాడు. అవును.. అతడికి 60 ఏళ్ల పైనే వయస్సు ఉంటుంది. కేవలం 2 గంటల్లోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. భైశాఖి బంపర్ లాటరీలో దాదాపు రూ.6 కోట్లు గెలిపొందాడు. దీంతో అతడితో పాటు ఫ్యామిలీ సైతం ఆనందంలో మునిగిపోయింది. 

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

కూరగాయల వ్యాపారికి జాక్ పాట్

పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్ జిల్లా కక్కోన్ గ్రామానికి చెందిన 68 ఏళ్ల తర్సేమ్ లాల్ ఒక కూరగాయల వ్యాపారి. అతడు తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. కొడుకు కెనడాలో ఉంటున్నాడు. వారికి సొంతిళ్లు లేకపోవడంతో వ్యాపారం చేసుకుంటూ నెల నెల అద్దె కట్టుకుంటున్నారు. ఇప్పుడు అతడికి లాటరీలో జాక్‌పాట్ తగలడంతో వారి జీవితమే మారిపోయింది. 

Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!

మొదట తనకి రూ.6 కోట్ల లాటరీ తగిలిందన్న విషయాన్ని తర్సేమ్ లాల్ నమ్మలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఈ మేరకు అతడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. గత 15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నట్లు తెలిపాడు. ఏదో ఒక రోజు తనకు లాటరీ తప్పకుండా తగులుందనే నమ్మకంతో తాను ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వచ్చిన డబ్బులతో సొంతిల్లు కొనుక్కుంటానని అన్నాడు. 

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

రెండు గంటల్లో జాక్ పాట్

తాను ఒక పనిమీద మార్కెట్‌కు వెళ్లి రూ.500 పెట్టి లాటరీ టికెట్ కొట్టానని చెప్పాడు. ఏప్రిల్ 19న లాటరీ విజేతలను ప్రకటించడానికి 2 గంటల ముందు టికెట్ కొన్నానని.. అలా రెండు గంటల్లోనే విజేతలను ప్రకటించారని పేర్కొన్నాడు. ఆ లాటరీలో తనకు రూ.6 కోట్ల జాక్ పాట్ తగిలిందన్నాడు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

viral-news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు