Wifes: ఏం స్కెచ్ వేశారమ్మా.. బ్యాంకులకు టోపీ పెట్టేందుకు కట్టుకున్న మొగుళ్లను!

బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు.

New Update
up womens bank

బ్యాంకులో తీసుకున్న  రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు. సదరు మహిళలపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406, 419, 467, 368, 471 కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.  

Also Read :  ఫేస్ మసాజ్ చేయించుకోవడం వల్ల ప్రయోజనాలేంటి?

గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద

ఇండస్ఇండ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ అందించిన గ్రూప్-లెండింగ్ స్కీమ్ కింద ఈ మహిళలు గతంలో రుణాలు తీసుకున్నారు.  ఈ రుణ పథకం గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకవేళ లబ్ధిదారురాలి భర్త మరణిస్తే, మిగిలిన రుణ వాయిదాలను మాఫీ చేస్తుంది. అయితే దీని అలుసుగా తీసుకున్న ఓ నలుగురు మహిళలు బ్యా్ంకుకే టోపీ పెట్టాలని అనుకున్నారు. ప్లాన్ లో భాగంగా..  ఈ నలుగురు మహిళలు తమ భర్తలు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టి్ంచి రుణాలను ఎగ్గొట్టాలని అనుకున్నారు. 

Also Read :  నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!

అయితే బ్యాంకు అధికారుల దర్యాప్తులో ఆ మహిళల భర్తలు బతికి ఉన్నట్లుగా తేలింది.  దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ దేవేష్ కుమార్ శర్మ వెల్లడించారు. 

Also read :  Sonu Sood wife : సోనూసూద్ భార్య సోనాలీకి యాక్సిడెంట్... తీవ్రగాయాలు!

Also Read:  హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!

 

police | women | uttar-pradesh | latest-telugu-news | today-news-in-telugu | telugu crime news | bank-loans

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు