/rtv/media/media_files/2025/09/28/vijay-stamped-2025-09-28-06-59-24.jpg)
తమిళనాడు(Tamil Nadu) కరూర్లో సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీ(TVK chief Vijay rally) లో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 38 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. సుమారు 65 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు విజయ్ పై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు ఆదేశించారు. ఈ దారుణ సంఘటనకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని డీజీపీ తెలిపారు.
ఆరు గంటల ఆలస్యం, భారీ జన సందోహం:
ఈ ర్యాలీకి కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నప్పటికీ, దాదాపు 30,000 నుండి 60,000 మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. మొదట విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని ప్రకటించినా, ఆయన దాదాపు 6 గంటలు ఆలస్యంగా రాత్రి 7 గంటల తర్వాత వచ్చారు. ఇంత మంది జనం చిన్న ప్రాంతంలో, ఎక్కువ సమయం వేచి ఉండటం వలన తొక్కిసలాటకు దారితీసింది.
VIDEO | TVK leader Vijay pauses speech in Karur, distributes water to people, arranges for ambulance for those in the crowd feeling suffocated.
— Press Trust of India (@PTI_News) September 27, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/uCBNuilCBZ
Also Read : విజయ్ ర్యాలీ.. ఘటనపై స్పందించిన నేతలు
భద్రతా లోపాలు, విద్యుత్ నిలిపివేత:
జన సమూహాన్ని నియంత్రించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం, భద్రతా సిబ్బంది కొరత తీవ్రంగా కనిపించింది. విజయ్(Vijay Dalapathy) ప్రసంగిస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారి గందరగోళం చెలరేగింది. భయాందోళనతో జనం ఒక్కసారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. రద్దీ కారణంగా అంబులెన్స్లు సైతం ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టమైంది.
The campaign was supposed to start in Karur at 12, and even by 2 PM barely 4,000 people had shown up. If he had simply followed his schedule and respected police instructions, none of this would have happened.
— Bad Boss (@StoryTimeWithK) September 28, 2025
But no, when you board a flight at 8:45 am at Chennai for an 8:30 am… pic.twitter.com/d1xyx6JCYT
Also Read : విజయ్ సభలో తొక్కిసలాట.. 30 మంది మృతి.. స్పాట్లో ..
తొక్కిసలాట మృతుల సంఖ్య పెరుగుదల:
తొక్కిసలాట కారణంగా ఊపిరాడక చాలా మంది స్పృహతప్పి పడిపోయారు. ఈ విషాదంలో 38 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. ఈ సంఘటనపై టీవీకే పార్టీ నిర్వాహకులపై, ముఖ్యంగా కరూర్ జిల్లా కార్యదర్శిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనపై నటుడు విజయ్ "నా గుండె ముక్కలైంది" అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.