/rtv/media/media_files/2025/09/16/facebook-love-that-remains-tragic-2025-09-16-12-27-06.jpg)
Facebook love that remains tragic
RAJASTAN LOVER MURDER : రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫేస్బుక్ (Face Book) ద్వారా పరిచయమైన ఓ మహిళ, ప్రేమ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. ప్రియుడిని పెళ్లికి ఒప్పించాలని వచ్చిన ఆమె ప్రియుడిని కలిసిన అనంతరం, తాను వచ్చిన కారులోనే శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టగా.. ఈ హత్య వెనుక ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. \
ఇది కూడా చూడండి:IT Returns: ఐటీ రిటర్న్ గడువు పెరిగినా..వెబ్ సైట్ పని చేయక తిప్పలు..
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని ఝుంఝునుకు చెందిన ముకేశ్ కుమారి, అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తోంది. పదేళ్ల క్రితమే గొడవల కారణంగా భర్తతో విడిపోయిన ముఖేష్ భర్తతో విడాకులు తీసుకుంది. గత ఏడాది ఫేస్బుక్ ద్వారా బార్మేర్కు చెందిన మనారామ్ అనే స్కూల్ టీచర్తో పరిచయం ఏర్పడింది. మనారామ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వారి మధ్య ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటూ, కలిసి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: సుధీర్ బాబు 'జటాధర' వచ్చేదప్పుడే ..!
అయితే, మనారామ్ కూడా వివాహితుడే అయినప్పటికీ తన భార్యతో విభేదాల కారణంగా విడిపోయాడు. వారి విడాకుల కేసు ఇంకా కోర్టులో నడుస్తోంది. ముకేశ్ కుమారి మాత్రం పెళ్లి విషయాన్ని సీరియస్గా తీసుకుంది, మనారామ్ను పెళ్లి చేసుకోవాలంటూ పలు మార్లు ఒత్తిడి చేసింది. ఈ నెల 10న ముకేశ్ కుమారి తన ఆల్టో కారులో దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించి, బార్మేర్లోని మనారామ్ ఇంటికి వెళ్లింది. అతడి కుటుంబానికి తాము ప్రేమించుకుంటున్నామని చెప్పింది. అయితే ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మనారామ్ ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి సర్దిచెప్పారు.
అదే రోజు సాయంత్రం, మనారామ్ – ముకేశ్ కుమారి ఇద్దరూ కలిసి ఒక నిర్మానుష్య ప్రాంతానికి కారులో వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత మరోసారి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపంతో మనారామ్ ఇనుప రాడ్తో ఆమె తలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో పెట్టి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. రెండ్రోజుల తర్వాత స్థానికులు పార్క్ చేసి ఉన్న కారును అనుమానంతో గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ముకేశ్ కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తులో భాగంగా ముకేశ్ కుమారి, మనారామ్ల ఫోన్ సిగ్నల్స్ ఒకేసారి ఒకే ప్రాంతంలో నమోదైనట్టు గుర్తించారు. మనారామ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు అతనిపై హత్యారోపణలతో కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చూడండి:Income Tax Returns : ఐటీఆర్ దాఖలు చేయలేదా? త్వరపడండి..ఈ రోజే చివరి అవకాశం!