/rtv/media/media_files/2025/09/16/jatadhara-2025-09-16-08-01-53.jpg)
JataDhara
JataDhara: సుధీర్ బాబు(Sudheer Babu), బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లింగ్ మిస్టరీ సినిమా "జటాధర" ఈ ఏడాది నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
భిన్నమైన కథాంశంతో "జటాధర"
జటాధర సినిమా కథ భారతీయ ఆధ్యాత్మికత, భక్తి విశ్వాసాలపై ఆధారపడిన మిస్టరీ డ్రామా. ఇందులో అనంత పద్మనాభస్వామి ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలను, దాని పట్ల ఉన్న అపోహలు, పవిత్ర శక్తుల గురించి వున్న నమ్మకాలను ఓ వినూత్న కోణంలో చూపించనున్నారు. ఈ సినిమా కథలో భయాన్ని, భక్తిని, విశ్వాసాన్ని ఒకే కథలో మేళవించారు.
ఈ సినిమాను జీ స్టూడియోస్, ప్రెర్నా అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలను అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ నిర్వహించారు. నిర్మాతలుగా ఉమేశ్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రెర్నా అరోరా, శిల్పా సింగ్హాల్, నిఖిల్ నందా వ్యవహరించారు. కో-ప్రొడ్యూసర్లుగా అక్షయ్ కేజ్రీవాల్, కుసుమ్ అరోరా ఉన్నారు.
Sudheer Babu's supernatural thriller 'Jatadhara' will release on November 7, 2025. Directed by Venkat Kalyan & Abhishek Jaiswal, the film marks Sonakshi Sinha's Tollywood debut and stars Shilpa Shirodkar in a key role. #Jatadhara#Sudheerbabu#sonakshisinha#ShilpaShirodkarpic.twitter.com/3SP9y7DWGq
— Snooper-Scope (@Snooper_Scope) September 15, 2025
భారీ విజువల్ ఫెస్టివల్..
ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా నటిస్తుండగా, ఇతర కీలక పాత్రల్లో దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇంద్రా కృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ కనిపించనున్నారు.
జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఉమేశ్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ, "జటాధర సినిమా కేవలం ఓ సినిమా కాదు - ఇది ఒక అనుభవం. ఇది మనం ఇప్పటివరకు చూడని స్థాయిలో కథన శైలి, విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, మిగతా నటీనటులతో కలిసి ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాం" అని అన్నారు.
Also Read:వైజాగ్ లో అల్లు అర్జున్ AAA సినిమాస్.. ఓపెనింగ్ ఎప్పుడంటే..?
ప్రెర్నా అరోరా మాట్లాడుతూ, "రుస్తుం తర్వాత జీ స్టూడియోస్తో నా మళ్లీ కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. 'జటాధర' సినిమా భారతీయ సంస్కృతిని ప్రపంచ స్థాయిలో చూపించేలా ఉంది. ఈ సినిమాకు మంచి కథ, గొప్ప విజన్ ఉన్నందున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది" అని తెలిపారు.
దర్శకులు అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ, "జటాధర సినిమాలో లోకకథలను ఆధారంగా తీసుకొని, అంధకారం, దివ్యశక్తి మధ్య జరుగుతున్న సంగ్రామాన్ని చూపించాం. ఇది భక్తి, భయం, గమ్యం మధ్య ఉన్న బలమైన బంధాన్ని చూపించే సినిమా" అని వివరించారు.
"జటాధర" అనే సినిమా సస్పెన్స్, మిస్టరీ, మైథలాజికల్ అంశాలతో రూపొందిన ఒక విభిన్న కథ. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లు నటించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.