/rtv/media/media_files/2025/06/06/AVo2Q6UbKCEDSrQ7kiOp.jpg)
Kamakshi
Bengaluru stampede : ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు విజయం సాధించడాన్ని విజయోత్సవంగా నిర్వహించాలనుకున్న వేడుక విషాదంగా మారిన విషయం తెలిసిందే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. కాగా మృతుల్లో తమిళనాడు రాష్ర్టం తిరుప్పూర్ జిల్లా ఉడుమలైకు చెందిన వివేకానంద విద్యాలయ పాఠశాల కరస్పాండెంట్ కూతురు కామాక్షి దేవి(28) మృతి చెందింది. ఆమె బెంగళూరు రామమూర్తినగర్లో ఉంటూ అమెజాన్ ఇండియా కంపెనీలో పని చేస్తున్నారు. క్రికెటర్లను చూసేందుకు వెళ్లిన ఆమె తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. కామాక్షి దేవి మృతదేహం గురువారం మధ్యాహ్నం ఉడుమలైకు తీసుకొచ్చారు.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో కామాక్షి తండ్రి మూర్తి వివేకానంద విద్యాలయ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజలక్ష్మి(60) ఈ విద్యాసంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తె కామాక్షి దేవి(27) ఐదేళ్లుగా బెంగళూరులో అమెజాన్ సంస్థలో మేనేజర్గా వ్యవహరిస్తున్నారు. స్నేహితులతో కలిసి కామాక్షి దేవి బెంగళూరు స్టేడియానికి వెళ్లి తొక్కిసలాటలో మరణించారు.
ఇది కూడా చూడండి: Operation Kagar : చత్తీస్ గఢ్ రాష్ట్రం లో మరో భారీ ఎన్ కౌంటర్...అగ్రనేత మృతి ?
కాగా కామాక్షి దేవి వారికి ఏకైక సంతానం. ఆమె మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగారు. ఆమె మృతదేహాన్ని ఉడుమలైపేటకు తీసుకొచ్చి వివేకానంద విద్యాలయ పాఠశాలలో ఉంచారు. ఏకై క కుమార్తెను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతంగా మారింది. కాగా ఆరుపదులు దాటిన తల్లిదండ్రులకు వయస్సు మీద పడడంతో ఇక, విద్యాసంస్థను నడిపించాలని కుమార్తెకు మూర్తి ఇటీవల సూచించారు. అయితే ఆమెకూడా త్వరలోనే బాధ్యతలు చేపడతానని చెప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఈ లోపే కానరాని లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకంలో ముంచింది.
Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!