Southwest Monsoon : ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు..మండుతుందిక్కడ

గతం కంటే ముందే రాష్ట్రంలోకి వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ముఖం చాటేసాయి. దీంతో ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించి వర్షాల మీద ప్రభావం చూపుతోంది. వర్షాలు లేకపోవడంతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది.

New Update
Southwest Monsoon

Southwest Monsoon

 Southwest Monsoon :  గతం కంటే ముందే రాష్ట్రంలోకి వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా ముఖం చాటేసాయి. దీంతో ప్రతికూల వాతావరణం కారణంగా తొలకరి మందగించి వర్షాల మీద ప్రభావం చూపుతోంది. వర్షాలు లేకపోవడంతో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. నైరుతి రాకతో వాతావరణం చల్లబడుతుందనుకున్న వారికి నిరాశే మిగిలింది. సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీల అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. గతంలో కంటే ఉక్కపోతలు పెరిగి జనం అల్లాడి పోతున్నారు. కాగా, నైరుతి రుతుపవనాలు 10 రోజుల ముందే పలుకరించినప్పటికీ షార్ట్‌ బ్రేక్‌ తీసుకున్నాయి. 

Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

తొందరపడి ఒక కోయిల మందే కూసిందన్నట్లు గతం  కంటే ముందే రుతుపవనాలు రాష్ట్రాన్ని  పలకరించడంతో  రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు మిగలకుండానే రుతుపవాలు ముఖం చాటేయడంతో రైతులు ఊసురోమంటున్నారు. గత నెల 29 తర్వాత మాన్ సూన్ మందగమనంలో కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వేగంగా విస్తరించిన ఋతువనలు కదలికలు దక్షిణ భారత దేశం, ఈశాన్య రాష్ట్రాల దగ్గర సెలవు తీసుకున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం. ఋతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ మొత్తం వెళ్లిపోవడంతో పొడి గాలులు వీస్తున్నాయి. దీనితో ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడంలేదు.

Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
 
ప్రస్తుతం అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్‌ బలహీనంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పుంజుకునే వరకు రుతుపవనాల్లో  కదలికలు సాధ్యం కాకపోవచ్చని అంచనా.  ఇప్పుడున్న పరిస్థితే ఉంటే మరో వారం పాటు నైరుతి రుతుపవనాలు  రాక  కష్టమేనని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఐతే, రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొద్దిరోజుల విరామం  తీసుకోవడం సాధారణమేనని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆలస్యమైతే  ఈనెల 12 తర్వాత తొలకరి విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 15ఏళ్ల విరామం తర్వాత నైరుతి రుతుపవనాలు బాగా అడ్వాన్స్ గా వచ్చాయి.  దీంతో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

రుతుపవనాలు ముఖం చాటేయడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌ నగరంలో వేడి తీవ్రత పెరిగింది. పగటి పూట సాధారణం కంటే అధికంగా ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఒక్కోసారి మబ్బులు పడుతున్నప్పటికీ వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో రాత్రి ఉక్కపోతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరిరవుతున్నారు.

  Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

Advertisment
Advertisment
తాజా కథనాలు