Madhya Pradesh: విద్యార్థులకు మద్యం తాగించిన ఉపాధ్యాయుడు..ఆ తర్వాత ఏం జరిగిందంటే...

ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం తెచ్చేలా ప్రవర్తించాడో టీచ‌ర్‌. ఏకంగా త‌ర‌గ‌తి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘ‌ట‌న సంచలనంగా మారింది. దీంతో ఉపాధ్యయుడిని స‌స్పెండ్ చేశారు.  

New Update
Teacher who gave alcohol to students

Teacher who gave alcohol to students

Madhya Pradesh : ఉపాధ్యాయ వృత్తికి క‌ళంకం తెచ్చేలా ప్రవర్తించాడో ప్రభుత్వ టీచ‌ర్‌. ఏకంగా త‌ర‌గ‌తి గదిలో మద్యం సేవించాడు. అంతేకాదు విద్యార్థులతో కూడా మద్యం తాగించాడు. మధ్యప్రదేశ్‌ కట్ని జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘ‌ట‌న సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట‌ వైర‌ల్ కావ‌డంతో ఉపాధ్యయుడిని స‌స్పెండ్ చేశారు.  

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపధ్యాయుడు పక్కదారి పట్టాడు. నిత్యం బడికి ఫుల్లుగా మద్యం సేవించి రావడమే కాకుండా తరగతి గదిలోని విద్యార్థుల చేత కూడా మద్యం తాగించాడు. తన వెంట తెచ్చుకున్న ఓ బాటిల్లోంచి విద్యార్థులకు మద్యం పోసి తాగించి ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

మధ్య ప్రదేశ్‌లోని కఠ్‌నీ జిల్లా బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామానికి చెంది న ప్రభుత్వ పాఠశాలలో.. లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం రోజు విధుల నిమిత్తం బడికి వచ్చిన ఆయన.. కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. ముఖ్యంగా తరగతి గదిలోనే కింద కూర్చుని.. తన వెంట తెచ్చుకున్న బాటిల్ తీసి పిల్లలను నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు. వారంతా ఓ మగ్గులో నీళ్లు తీసుకు రాగా.. చిన్న చిన్న టీ గ్లాసులు తీసి అందులో మద్యం పోశాడు. ఆపై వాటిలో కాస్త నీళ్లు కలిపి.. ఐదారుగురు విద్యార్థులకు అందించాడు. తాగమని చెప్పాడు.

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

ఉపాధ్యాయుడు చెప్పిందే ఆలస్యం ఆ విద్యార్థులు కూడా మద్యం సేవించారు. అయితే అక్కడే ఉన్నవారెవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలా ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అయింది. ముఖ్యంగా మద్యం సేవించిన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులందరి కంట పడింది. దీంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడికి వెళ్లి మరీ సదరు ఉపాధ్యాయుడిని నిలదీశారు. చదువు నేర్చుకునేందుకు వచ్చిన వారికి మద్యం సేవించడం నేర్పిస్తారా అంటూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టారు. మరోవైపు ఈ వీడియోను జిల్లా కెలక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ కూడా చూశారు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

దీంతో ఆయన కూడా రంగంలోకి దిగారు. ఇది నిజమేనా కాదా అని తెలుసుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు. దీంతో గ్రామస్థులంతా వచ్చి నిజంగానే ఆయన మద్యం తాగించారని, ఎప్పుడూ మద్యం సేవించే ఆయన బడికి వస్తారని చెప్పారు. ఆయన పద్ధతి చాలా రోజులుగా బాగాలేదని, కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో తామేమీ అనలేకపోయామని చెప్పుకొచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కలెక్టర్.. ఉపాధ్యాయుడు లాల్ నవీన్ ప్రతాప్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. దీంతో ఆయన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు