/rtv/media/media_files/2025/10/13/supreme-court-2025-10-13-11-53-12.jpg)
Supreme Court
శీతాకాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంటోంది. ప్రతీ సవంత్సరం ఢిల్లీ ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300 నుంచి 400 దాటడం అనేది సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో వాయు కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది. ఢిల్లీలో పలు నిర్మాణాలపై నిషేధం విధించడాన్ని తిరస్కరించింది.
Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్ గురించి తెలుసా ?
ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని పేర్కొంది. అయితే ఈ కాలుష్య సమస్యను పరిష్కరించే దిశగా నవంబర్ 19లోగా ఓ ప్లాన్తో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక పరిష్కారాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. దీర్ఘకాలిక పరిష్కారాలు జరిగేలా ప్రణాళికను రూపొందించాలని సూచనలు చేసింది.
Also Read: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం
Follow Us