/rtv/media/media_files/2025/02/15/unIzrsBFDHpnAk6u97Jf.jpg)
ADE Sathish Reddy
లంచం...లంచం...భారతదేశంలో ఎంత దీన్ని ఫోగొడదామని చూస్తుంటే అంతలా వ్యాపిస్తోంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో చిన్న ఉద్యోగుల దగ్గర నుంచి పెద్ద పెద్ద అధికారుల వరకు అవినీతి తిమింగలాలే. చేయి తడిపితే కానీ పని అవ్వని పరిస్థితి. దీని కారణంగా ఉద్యోగులు, ఆఫీసర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. డబ్బులిస్తే కానీ పని జరగకపోవడంతో సామాస్యులకు కూడా మరో ఆప్షన్ లేకుండా పోయింది. చచ్చినట్టు ఇష్టం ఉన్నా లేకపోయినా లంచాలు ఇస్తున్నారు.
Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!
తవ్వే కొద్దీ బయటపడ్డ ఆస్తులు..
గచ్చిబౌలీ విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అక్కడ తవ్వకాలు మొదలెట్టిన అధికారులు అలా తవ్వుకుంటూ పోయారు. అది ఎంతకీ ఆగలేదు. రెండు రోజుల పాటూ కొనసాగిన సోదాల్లో సతీశ్ రెడ్డి విపరీతంగా ఆస్తులు బయటపడ్డాయి. తవ్వేకొద్ది అతని ఆస్తులు, లంచావాతరం హిస్టరీ బయటపడిందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఓపెన్ ప్లాట్లు, విల్లా, భవనాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ స్థిరాస్తుల మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏడీఈ నివాసంలో స్థిరాస్తి పత్రాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. సోదాల తర్వాత ఏడీఈ సతీశ్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు కస్టడీ విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని..మరిన్ని ఆస్తులు బయటపడతాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.
Also Read: Sports: వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ పై మూడు నెలల నిషేధం