/rtv/media/media_files/2025/07/10/shubhanshu-shukla-1-2025-07-10-16-49-29.jpg)
Shubhanshu Shukla:
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పరిశోధనల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతరిక్షంలో శుభాన్షు రైతు అవతారమెత్తారు. జీరో గ్రావిటీ వాతావరణంలో మొక్కల పెరుగుదలపై అధ్యయనంలో భాగంగా.. ఆయన మెంతి, పెసర విత్తనాలను పెంచుతున్నారు. గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను నాటి..ISSలోని ప్రత్యేక నిల్వ ఫ్రీజర్లో వాటిని పెట్టారు. ఆ తర్వాత అవి మొలకెత్తే విధానాన్ని ఫొటోలు తీశారు.
Also Read: ఆ ఉద్యోగుల ఉసురు పోసుకుని.. 4 వేల కోట్లు మిగుల్చుకున్న మైక్రోసాఫ్ట్.. షాకింగ్ లెక్కలు!
Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!
ఈ పరిశోధనలో ధార్వాడ్ అగ్నికల్చర్ యూనివర్సిటీకి చెందిన రవికుమార్ హోసమణి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి అనే ఇద్దరు శాస్త్రవేత్తలు శుక్లాకు సహకరిస్తున్నారు. స్పేస్ యాత్ర ముగించుకుని భూమికి తిరిగి వచ్చాక.. ఈ మొలకల్లోని జన్యు మార్పులు, పోషక విలువలను విశ్లేషిస్తారు. ఇక శుభాన్షు శుక్లా.. వ్యవసాయ ప్రయోగాలతో పాటు మరిన్ని కీలక పరిశోధనలను కూడా చేస్తున్నారు.
Also Read: భార్య చేతిలో మరో భర్త బలి.. లవర్తో ఎంత దారుణంగా చంపించిందంటే..?
Also Read: చెడు కలలతో టార్చర్గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!