Chardham Yatra :  చార్‌ధామ్‌ యాత్రకు 150 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు...ఇప్పటికే 28 లక్షల మంది...

భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి పిలిచే చార్‌ ధామ్‌ యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది యాత్రకోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో 150కిపైగా దేశాలకు చెందినవారున్నారు.

New Update
Chardham Yatra 2024: ప్రారంభమైన పవిత్ర చార్ ధామ్ యాత్ర.. తెరుచుకున్న ఆలయాలు.. 

Chardham Yatra

Chardham Yatra : భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక, పూరీ, రామేశ్వరం లను కలిపి పిలిచే చార్‌ ధామ్‌ యాత్రకు భారీ స్పందన వస్తోంది.  ఇప్పటి వరకు దాదాపు 28లక్షల మంది యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా150కిపైగా దేశాల నుంచి 31,581 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు, ఒక శైవ క్షేత్రము ఉంది. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది. ఈ యాత్రకు విదేశాల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

ఎక్కువ మంది అమెరికా, నేపాల్‌, మలేషియా, యూకే, ఆస్ట్రేలియా, కెనడాల నుంచే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌ హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లతో పాటు హేమకుండ్ సాహిబ్ సందర్శించుకునేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్లుగా పర్యాటశాఖ రిజిస్ట్రేషన్‌ గణాంకాలు చెబుతున్నాయి. నేపాల్‌ నుంచి 5,728 మంది యాత్రికులు రిజిస్టర్ చేసుకున్నారు.  

ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం


కాగా వివిధ దేశాల నుంచి రిజిస్ట్రేషన్‌ పరంగా చూస్తే అమెరికా నుంచి 5,864, యూకే నుంచి 1,559, మారిషస్ నుంచి 837, ఇండోనేషియా నుంచి 327, కెనడా నుంచి 888, ఆస్ట్రేలియా నుంచి 1,259 మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నట్లుగా పేర్కొన్నారు.  ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రజలు చార్‌ధామ్ యాత్రకు రావడానికి ఆసక్తి చూపుతున్నారని  రిజిస్ట్రేషన్ నోడల్ అధికారి యోగేంద్ర గంగ్వార్ తెలిపారు.

ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30న ప్రారంభం కాగా మే 14 వరకు 7.18 లక్షలకుపైగా భక్తులు చార్‌ధామ్‌ను సందర్శించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగుతోంది. హరిద్వార్, రిషికేశ్, హెర్బర్ట్‌పూర్, వికాస్‌నగర్‌లో ఒక రోజులో 18 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్‌నాథ్‌ను దర్శించుకునేందుకు 11,576, బద్రీనాథ్‌ 9,320, గంగోత్రి 5,542, యమునోత్రి 4869, హేమకుండ్‌ సాహిబ్‌ దర్శనం కోసం 274 మంది విదేశీయులు పేర్లు నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు