/rtv/media/media_files/2025/11/08/rahul-gandhi-responds-on-kids-having-mid-day-meals-on-newspapers-in-madhya-pradesh-2025-11-08-17-40-02.jpg)
Rahul Gandhi Responds on kids having mid-day meals on newspapers in Madhya Pradesh
మధ్యప్రదేశ్లో కొందరు చిన్నారులకు న్యూస్పేపర్లో మధ్యాహ్నం భోజనం వడ్డించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్యోపుర్ జిల్లాలోని ఓ స్కూల్లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందించారు. ఈ వీడియోను పోస్టు చేసి.. తన హృదయం ముక్కలైందని రాసుకొచ్చారు. ఇలాంటి దయనీయ పరిస్థితిపై అధికార నేతలు సిగ్గుపడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: బీహార్ ఎన్నికల్లో కలకలం.. రోడ్లపై VVPAT స్లిప్స్.. VIDEO
పిల్లలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వాళ్లకి మాత్రం కనీస గౌరవం దక్కడం లేదని విమర్శించారు. అక్కడ అభివృద్ధి అనేది అంతా ఓ భ్రమా అంటూ విరుచుకుపడ్డారు. వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని అధికారంలోకి వస్తున్నారని.. ఇలాంటి దయానీయమైన స్థితిలో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధికార నేతల సిగ్గుపడాలంటూ'' రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
आज मध्य प्रदेश जा रहा हूं।
— Rahul Gandhi (@RahulGandhi) November 8, 2025
और जब से ये खबर देखी है कि वहां बच्चों को मिड-डे मील अख़बार पर परोसा जा रहा है, दिल टूट सा गया है।
ये वही मासूम बच्चे हैं जिनके सपनों पर देश का भविष्य टिका है, और उन्हें इज़्ज़त की थाली तक नसीब नहीं।
20 साल से ज्यादा की BJP सरकार, और बच्चों की थाली… pic.twitter.com/ShQ2YttnIs
Also Read: ఇజ్రాయిల్, ఇండియా కలిసి పాక్పై దాడికి ప్లాన్.. ఇందిరాగాంధీ ఎంట్రీతో సీన్ రివర్స్
మరోవైపు ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఆ స్కూల్ ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. నెటిజన్లు కూడా అక్కడి అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మధ్నాహ్య భోజనం అనేది పిల్లల హక్కని.. కానీ వాళ్లకు ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం వడ్డిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Follow Us