Rafale Jets : క‌శ్మీర్ బోర్డర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్

పాకిస్తాన్‌ - ఇండియా దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళానికి సంబంధించిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు జ‌మ్మూక‌శ్మీర్ గ‌గ‌న వీధుల్లో ప‌హారా కాసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ మీడియా వార్తలను ప్రచారం చేసింది.

New Update

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్‌ - ఇండియా దేశాల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య భారత వైమానిక దళం (IAF) కు సంబంధించిన నాలుగు రాఫెల్ యుద్ధ విమానాలు మంగళవారం రాత్రి జ‌మ్మూక‌శ్మీర్ గ‌గ‌న వీధుల్లో ప‌హారా కాసిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పాక్ మీడియా వార్తలను ప్రచారం చేసింది.

పాక్ ఆర్మీ అలర్ట్‌

పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు చూసి పాక్ ఆర్మీ అలర్ట్‌ అయి వెన‌క్కి పంపిన‌ట్లుగా పేర్కొంది.  అయితే ఆ రాఫెల్ విమానాలు . లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాట‌లేద‌ని తెలిపింది. భారత్త నిఘా డ్రోన్లు సైతం LOCలో సంచరించినట్లు కథనంలో తెలిపింది.   సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా..గిల్గిట్, POKకు అన్ని విమానాలను పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది.  భారత్ చేసే ఏదైనా దురాక్రమణకు తగిన సమాధానం ఇవ్వడానికి పాకిస్తాన్ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు