/rtv/media/media_files/2025/04/30/Sk5ADDA9XuuQGUF55k0U.jpg)
Jawans Occupied Karreguttas
మావోయిస్టులను లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ 9వ రోజుకి చేరుకుంది. కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టు నేతలే టార్గెట్గా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే తాజాగా భద్రతా బలగాలు కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. కర్రెగుట్టపై పూర్తి పట్టు సాధించాయి. దీంతో ఆపరేషన్ కగార్ సక్సె్ అయ్యింది. ఈ ఆపరేషన్లో 10 వేల మందికి పైగా సాయుధ బలగాలు పాల్గొన్నాయి.
Also Read: 'పాకిస్తాన్ జిందాబాద్'...సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్!
కర్రెగుట్టల్లో 5 వేల అడుగుల ఎత్తు వరకు చేరుకున్న భద్రతా బలగాలు బుధవారం జాతీయ పతకాన్ని ఎగురవేశాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. CRPF నేతృత్వంలోని ఛత్తీస్గఢ్కు చెందిన కోబ్రా, డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ చేపట్టాయి. తెలంగాణలోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్లోని పూజారికాంకేరు, నంబి, గల్గం, నడిపల్లి వరకు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్లోని నక్సల్ స్థావరమైన 'కర్రెగుట్ట కొండలను' భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 💥👍 https://t.co/hhtkas1c3M
— Updates0091 🇮🇳 (@updates0091) April 30, 2025
Also Read: బరితెగించిన పాక్.. పహల్గామ్ ప్రధాన నిందితుడికి ప్రభుత్వ బలగాలతో సెక్యూరిటీ!
అయితే కర్రెగుట్టను పోలీసు భద్రతా బలగాలు ఇప్పటికే చుట్టుముట్టేశాయి. ఆ ప్రాంతంలో మావోయిస్టులు పెట్టిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ ఆపరేషన్లో పాత టీమ్ను వెనక్కి తీసుకొచ్చి.. కొత్త టీమ్ను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో హెలికాఫ్టర్, డ్రోన్లతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మావోయిస్టుల సొరంగ మార్గాలు, రహస్య ప్రాంతాలను గుర్తించారు. అయితే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతూ.. మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
Also Read:దేశంలో కులగణన.. మోదీ సర్కార్ సంచలన ప్రకటన!