డియర్ EC.. ఎలక్షన్ కమిషన్‌కు రాహుల్ గాంధీ 2 డిమాండ్లు

మహారాష్ట్రతో సహా ఇటీవల జరిగిన అన్నీ రాష్ట్రాల ఓటరు లిస్ట్ ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ ECని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

New Update
RAHUL GANDHI

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికలపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ స్పందించింది. 2024 న‌వంబ‌ర్‌లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ విధంగానే ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆయన Xలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆయన ఆరోపణలను ఎన్నికల కమిషన్ ఖండించింది. రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమైనవని తీవ్రంగా తిరస్కరించింది ఈసీ. అయితే తిరిగి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ Xలో మరో ట్వీట్ చేశారు. ఆయన ఎక్స్  పోస్ట్‌లో.. ఎన్నికల కమిషన్ ఓ రాజ్యాంగ సంస్థ. మీరు దాచడానికి ఏమీ లేకపోతే, నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

ఎలక్షన్ కమిషన్‌కు రాహుల్ గాంధీ డిమాండ్లు

మహారాష్ట్రతో సహా అన్ని రాష్ట్రాల లోక్‌సభ, విధాన సభలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు ఏకీకృత, డిజిటల్, మెషిన్-రీడబుల్ ఓటరు జాబితాలను ప్రచురించాలి.
 మహారాష్ట్ర పోలింగ్ బూత్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలి.

ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవడం కరెక్ట్ కాదు. నా ప్రశ్నలకు నిజమైన సమధానం చెప్పాలి.

election-commission | Rahul Gandhi | maharashtra election | maharashtra election 2024 | bjp | latest-telugu-news | ec 

Advertisment
Advertisment
తాజా కథనాలు