/rtv/media/media_files/2026/02/18/punjab-2026-02-18-15-11-28.jpg)
Punjab bride showered with Rs 8.5 crore at wedding? Groom's family denies claim
పంజాబ్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆశ్చరకర ఘటన చోటుచేసుకుంది. వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. వధువుపై ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఆ కుటుంబం ఈ వార్తలను ఖండించింది. తాము అంతగా ఖర్చు చేయలేదని.. కేవలం రూ.2 లక్షల విలువైన కరెన్సీ నోట్లను మాత్రమే వెదజల్లినట్లు స్పష్టం చేసింది.
Also Read: నార్త్కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కూతురు, సోదరి మధ్య వారసత్వ పోటీ
Punjab Bride Showered With Rs 8.5 Crore At Wedding
ఇక వివరాల్లోకి పంజాబ్లోని తర్న్ జిల్లాలో ఫిబ్రవరి 14న ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో వధువు వేదిక వద్ద నిలబడి ఉండగా కుటుంబ సభ్యులు ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. వేడుకకు వచ్చిన వారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. పెళ్లి కూతురుపై రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లినట్లు ప్రచారం నడిచింది.
Also Read: పాక్, చైనాకు చుక్కలే.. ఫ్రాన్స్తో భారత్ సంచలన ఒప్పందం
చివరికి దీనిపై స్పందించిన ఆ కుటుంబ సభ్యులు కేవలం రూ.2 లక్షల విలువైన కరెన్సీ నోట్లే వాడినట్లు క్లారిటీ ఇచ్చారు. తమపై ఇలా తప్పుడు ప్రచారాలు చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ వివాహ వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్ కూడా దీనిపై స్పందించారు. పెళ్లికూతురుపై రూ.4 లక్షల విలువైన కరెన్సీ నోట్లను వాడినట్లు చెప్పారు.
Follow Us