/rtv/media/media_files/2025/01/18/cqRDJc4K18i7UpqzlvWe.jpg)
pune crime news
Crime News: పుణెలో దారుణం ఘటన చోటు చేసుకుంది. మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం ఏమాత్రం లోటు లేదనిపించే జీవితం ఉన్నా.. ఓ యువతి ఆత్మహత్య ఘటన చర్చనీయాంశంగా మారింది. అభిలాశ భౌసాహెబ్ కొతింబిరే అనే 25 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్.. 21వ అంతస్థు పై నుంచి దూకి ప్రాణాలను విడించిది. ఈ విషాదకర ఘటన వారి కుటుంబంతోపాటు పుణె నగరంలో కలకలం రేపింది.
21వ అంతస్థు పై నుంచి దూకి ..
అభిలాశకు మంచి ఉద్యోగం ఉంది. మానసికంగా ఇబ్బందులు ఉన్నట్లు ఎలాంటి సూచనలూ లేవు. కానీ ఆమె రాసిన సూసైడ్ నోట్ మాత్రం షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఐయామ్ డన్ లివింగ్.. ఐ డోంట్ వాంట్ టు లివ్ ఎనీమోర్ అనే వాక్యాలు ఆమె గుండె లోతుల్లో ఉన్న బాధను ప్రపంచానికి తెలిపాయి. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ.. తాను బతకలేకపోతున్నానని పేర్కొనడం వారి హృదయాలను కలిచి వేసింది.
ఇది కూడా చదవండి: చెడు కొలెస్ట్రాల్ను త్వరగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ రూల్స్ పాటించండి!
మార్చి 31 తెల్లవారుజామున 4:30 గంటలకు హింజవాడిలోని క్రౌన్ గ్రీన్ అపార్ట్మెంట్కు చేరుకున్న అభిలాశ.. అక్కడ 21వ అంతస్తులో నివసిస్తున్న స్నేహితుణ్ని కలవడానికి వెళ్లింది. కానీ అచేతనంగా ఉన్న తన ఆత్మను ఆ క్షణాన ఆ గాలిలో వదిలేసింది. పోలీసులు జూన్ 5న ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మొదట ఆత్మహత్యకు కారణం ఏమై ఉండొచ్చో తేలకపోయినా.. ఒత్తిడి, ఒంటరితనం, మానసిక స్థైర్య లేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగం బ్రైట్ కెరీర్ లా కనిపించినా.. దాని లోపలి ఒత్తిళ్లు ఎటువంటి మానసిక సంఘర్షణలకు దారితీయవచ్చో ఈ ఘటనను చూస్తే అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే యువత ఒత్తిడి కారణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
( crime news | telugu-news | crime | pune Latest News)
ఇది కూడా చదవండి: మీ బిడ్డను రాత్రి నిద్రపుచ్చేటప్పుడు మీకు అసౌకర్యంగా అనిపిస్తుందా? ఇలా చేయండి!