/rtv/media/media_files/2025/05/07/ASs6aNY25lkQVQ1SJEtP.jpg)
Operation Sindoor
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అవిపీక్స్ కు చేరుకున్నాయి. ఇన్నాళ్ళు పాకిస్తాన్ పై నదీజలాలు, దౌత్యపరంగా దాడులు చేస్తున్న ఇండియా నిన్న అర్థరాత్రి నుంచి ప్రత్యక్ష దాడులను చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్థరాత్రి 1.44 గంటలకు పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేపట్టింది భారత సైన్యం. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. సీమాంతర దాడులకు కారణమని భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపింది. దీనికి భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. భారత ప్రధాని మోదీ ఈ మొత్తం ఆపరేషన్ ను దగ్గరుండి ప్రతీ నిమిషం మోనిటర్ చేస్తున్నారు.
So it’s been called Operation Sindoor.
— Sonam Mahajan (@AsYouNotWish) May 6, 2025
Nine sites hosting terrorist activity and infrastructure hit; no Pakistani military facilities targeted. pic.twitter.com/drPTHpeSp4
తొమ్మిది ఉగ్రస్థావరాలపై..
తాము ఎక్కడ దాడి చేస్తున్నమో తెలిసే..పూర్తి కచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని భారత ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ సైనిక బలగాల మీద, సదుపాయాల మీదా అటాక్ చేయలేదని స్పష్టం చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఈ డిని నిర్వహించాయి. మిస్సైళ్ళతో విరుచుకుపడింది. గత మూడు నాలుగు రోజులుగా దాడులు చేస్తామని చెబుతున్న భారత ప్రభుత్వం మొత్తానికి రంగంలోకి దిగింది. మరోవైపు ఈరోజు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం చేపట్టిన దాడుల గురించి పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని రక్షణశాఖ ప్రకటించింది.
⚡️Bhawalpur missile strike visuals. People evacuated from the area by Pakistani authorities#OperationSindoor #PahalgamTerroristAttack #PakistanArmyBehindPahalgam pic.twitter.com/0gIKVtXLFp
— 🪷 Santanu Mallick 🇮🇳 (@Santanu_100) May 6, 2025
ఇక న్యాయం జరిగింది అంటూ భారత ఆర్మీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటూ దాడులకు సంబంధించిన వీడియోలు కూడా పెట్టింది. అయితే దాడులు ఎక్కడ చేశారో మాత్రం చెప్పలేదు. టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు మురిడ్కే హెడ్ క్వార్టర్స్గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉంది. వీటిపైనే ఇండియన్ ఆర్మీ అటాక్ చేసి ఉంటుందని అంటున్నారు.
today-latest-news-in-telugu | india | war | attacks | terrorists