/rtv/media/media_files/2025/01/18/bHPVlN2SihpJCNpbidm6.jpg)
PM Modi
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సాధికారత కల్పించేందుకు కేంద్రం సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (SVAMITVA) స్కీమ్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ శనివారం ఈ స్వామిత్వ పథకం కింద ప్రజలకు ఆస్తి కార్డులు పంపిణీ చేశారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 65 లక్షల మందికి పైగా కార్డులు అందించారు. అయితే ఈ స్కీమ్ కింద దేశంలో 10 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 230 జిల్లాల్లోని లబ్ధిదారులు ఈ కార్డులు అందుకున్నారు.
Also Read: మెడికల్ స్టూడెంట్ పై హత్యాచారం చేసింది అతడే.. కోల్కతా కోర్టు సంచలన తీర్పు!
మొత్తంగా 50 వేల గ్రామాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ''ఈరోజు చారిత్రాత్మకమైన రోజు. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది మంది ఈ స్వామిత్వ స్కీమ్ ద్వరా ప్రయోనాలు పొందుతున్నారు.
5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఇప్పటిదాకా 1.5 కోట్ల మందికి స్వామిత్వ ఆస్తి కార్డులు పంపిణీ చేశాం. ఈరోజు మరో 65 లక్షల కుటుంబాలకు ఈ కార్డులు అందజేశాం. దీనివల్ల గ్రామాల్లోని 2.25 కోట్లమంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను పొందారని'' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
Also Read: ఉద్యోగం ఊడినా పరువు మాత్రం సేఫ్.. చైనాలో ఫేక్ జాబ్ ట్రెండ్!