/rtv/media/media_files/2025/05/29/pNL5BHAhcaxxdCS0X3bc.jpg)
Railway Station
సాధారణంగా మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్కు వెళ్తే చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకుంటారు. కొందరు యూట్యూబర్లయితే వ్లాగ్ వీడియోలు కూడా తీస్తారు. కానీ ఇక నుంచి ఆ పర్మిషన్ ఉండదు. దీనికి కారణం ఇటీవల వెలుగు చేసిన జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసు ప్రభావమే. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రక్షణకు సంబంధించిన ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో ఫొటోలు, వీడియోలు తీయడం వల్ల ఉగ్రవాదులకు సమాచారం ఈజీగా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలాంటి కీలక ప్రాంతాల్లో ఫొటోలు, వీడియోలు తీయకూండా నిషేధం విధించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
Photos And Videos Banned In Railway Station
ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని రైల్వే స్టేషన్లో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు తీయడంపై యోగీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా కారణాల రీత్యా అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచింది. ఇదిలాఉండగా.. పహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్లు తీసిన వీడియోల వల్లే ఉగ్రవాదులు పకడ్బందీగా ప్లాన్ చేసి అటాక్ చేసినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
యూట్యూబర్లు వీటికి సంబంధించిన ఫీడ్ను రహస్యంగా ఎవరికీ షేర్ చేయకపోయినా కూడా ఉగ్రవాదులు సోషల్మ మీడియా ద్వారా ఆ వీడియోలు పొందే ఛాన్స్ ఉంటుంది. వీటి ఆధారలతోనే కీలకమైన ప్రాంతాలను టార్గెట్ చేసే అవకాశం ఉండటం వల్లే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో సెల్ఫీలు, ఫోటోలు, వీడియోలపై నిషేధం విధించింది. మరోవైపు దేశ భద్రతకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సెక్యూరిటీని మరింత పెంచాయి. యూపీ లాగే ఇతర రాష్ట్రాలు కూడా వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
Also Read : రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు
rtv-news | indian spy arrest