/rtv/media/media_files/2025/09/23/pak-missel-2025-09-23-07-35-48.jpg)
పాకిస్తాన్(pakistan) కు చెందిన ఓ క్షిపణి(missile) శిథిలాలు జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సు(Dal Lake) లో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది. ఎప్పటిలాగే దాల్ సరస్సు శుభ్రం చేస్తుండగా క్షిపణి శిధిలాలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికులలో భయాందోళనలను పెంచింది.
#BREAKING: #OperationSindoor time unexploded missile component found in Dal Lake, Srinagar, Kashmir during regular clean up. J&K Police confirms to @NDTV. Pakistan had fired the missile. Contained explosion of unexploded munition taking place. Area cleared of traffic in Srinagar. pic.twitter.com/3sJN6vZAQm
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 22, 2025
Also Read : మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం.. ట్వీట్లతో పాక్ పరువు తీసిన ఇండియన్ ఓపెనర్లు!
Pakistani Missile In Dal Lake
మే నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సింధూర్"ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సమయంలోనే పాకిస్తాన్ వైపు నుంచి క్షిపణి దాడులు జరిగాయి. ఆ సమయంలో శ్రీనగర్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని, దాల్ సరస్సు నుంచి పొగలు వెలువడ్డాయని అధికారులు తెలిపారు. సరస్సులో పడిన క్షిపణి శిథిలాలను అప్పట్లో భద్రతా బలగాలు వెలికితీశాయి. అయితే, తాజాగా క్లీనింగ్ డ్రైవ్లో మరోసారి క్షిపణి అవశేషాలు బయటపడడ్డాయి.
Missile/drone crashes into Srinagar’s Dal Lake this morning after intercept. Was likely one of the loud ‘thuds’ I heard while I was reporting live. Debris recovered and many analysed. pic.twitter.com/1gk53MPB0d
— Shiv Aroor (@ShivAroor) May 10, 2025
స్థానికంగా ఉన్న లేక్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (LCMA) సిబ్బందికి శనివారం ఈ శిథిలాలు దొరికాయి. వెంటనే వారు వీటిని సమీప పోలీస్ స్టేషన్కు అప్పగించారు. క్షిపణిలో యాక్టీవ్ మిస్సేల్ భాగాలు ఉన్నాయని, వాటిని డిస్మాటిల్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. క్షిపణిలోని ఓ భాగాన్ని వైమానిక దళానికి అప్పగించినట్లు పేర్కొన్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ క్షిపణి పేలి ఉంటే శ్రీనగర్లోని ప్రధాన పర్యాటక కేంద్రమైన దాల్ సరస్సులో భారీ విపత్తు సంభవించి ఉండేది. ఈ ఘటన తీవ్రతను గుర్తించిన అధికారులు, ఈ శిథిలాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను మరోసారి గుర్తు చేసింది. దేశ భద్రతకు ఇలాంటి ఘటనలు పెను సవాలుగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ