/rtv/media/media_files/2025/09/02/pakistan-floods-2025-09-02-21-10-31.jpg)
Pakistan Floods
భారీ వరదలు పాకిస్తాన్ దేశాన్ని అతలా కుతలం చేస్తున్నాయి. ప్రజలు తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. వరదల కారణంగా పంటలు, పశు సంపద భారీగా ధ్వంసం అయ్యాయి. దీని వల్ల ఆహార పదార్థాల ఉత్పత్తి తగ్గి, వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
Also Read:కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
Pakistan Floods
రోడ్లు, వంతెనలు, విద్యుత్ వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల నిత్యావసర సరుకులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయడం కష్టంగా మారింది. దీంతో సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడి ధరలు మరింత పెరిగాయి. వరదల ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ ప్రజల కష్టాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు
🌊💸 Punjab Floods Trigger Sharp Rise In Food Prices!
— Bloom Pakistan (@bloom_pakistan) September 1, 2025
As Floodwaters Disrupt Supply Chains, Families In Lahore And Across Punjab Are Paying The Price At Markets. Onions, Vegetables, And Other Essentials Have Become Costly Amid Shortages.
🔥 The Price Shock:
⚡ Vegetables At… pic.twitter.com/ZG5cRLWFRS
ఈ పరిస్థితులు పాకిస్తాన్ ప్రజల జీవితాలను మరింత దుర్భరం చేశాయి. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్లో కూరగాయల సరఫరా లేకపోవడం వల్ల, చెడిపోయిన కూరగాయలను కూడా అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది.
Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్
ప్రస్తుతం పాకిస్తాన్లో కిలో టమోటా ధర రూ.300లకు పైగా చేరింది. అదే సమయంలో ఉల్లిపాయల రేటు కూడా రూ.250 లకు పైగా చేరుకుందని చెబుతున్నారు. అదేవిధంగా ఇతర కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. గతంలో కంటే కూరగాయల ధరలు పెరగడంతో ప్రజలు కలత చెందుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 60 శాతానికి పైగా వ్యవసాయం నాశనమైందని, కూరగాయల పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.
Floods and Rains Trigger Soaring
— Currentpak (@_currentpak) September 1, 2025
Tomato at Rs200, Potato at Rs150
Vegetable Prices Skyrocket Amid Shortages in Lahore pic.twitter.com/rSD0EoIxyE
వరదల కారణంగా పాకిస్తాన్లో బంగాళాదుంపల ధర కిలోకు రూ.100 కంటే ఎక్కువగా ఉందని పలు మీడియాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితం కిలోకు రూ.40కి అమ్ముడైన పాలకూర ధర కూడా కిలోకు రూ.200, కిలో లేడీఫింగర్ ధర రూ.200, కిలో పొట్లకాయ ధర రూ.160, కిలో వంకాయలు రూ.200, కిలో టమోటాలు రూ.350కి అమ్ముతున్నట్లు సమాచారం. పాకిస్తాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు పెరుగుతున్న కూరగాయల ధరలు సామాన్యుల వెన్ను విరిచాయి.