Kashmiri Pandits: ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు

35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

New Update
kashmirpandit

జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir) లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల తర్వాత కశ్మీరీ పండితులు(Kashmiri Pandits) పురాతన శారదా భవాని ఆలయాన్ని తిరిగి తెరిచారు. బద్గాం జిల్లా, ఇచ్కూట్ గ్రామంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి స్థానిక ముస్లింలను ముఖ్య అతిధిలుగా ఆహ్వానించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆలయ పునరుద్ధరణలో స్థానిక ముస్లింలు కీలక పాత్ర పోషించారు. వారు పండితులకు ఆలయాన్ని శుభ్రం చేయడానికి, మరమ్మతులు చేయడానికి మరియు విగ్రహాలను ప్రతిష్టించడానికి పూర్తి సహాయాన్ని అందించారు.

Also Read :  ఉపరాష్ట్రపతి నివాసం ఖాళీ చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్

శివలింగాన్ని ప్రతిష్టించారు

ఆలయంలో పూజలు, భజనలతో పాటుగా, ఆలయ ఆవరణలో దొరికిన శివలింగాన్ని ప్రతిష్టించారు. ఇది ఈ పునరుద్ధరణ కార్యక్రమానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తీసుకువచ్చింది. ఆలయాన్ని తిరిగి ప్రారంభించిన పండితులు వారానికోసారి లేదా నెలలో రెండుసార్లు పూజలు మరియు ప్రార్థనలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే, ఆలయాన్ని పూర్తిగా పునఃనిర్మించడానికి జిల్లా అధికారులను కూడా సంప్రదించారు.  1990లో కాశ్మీరీ పండితుల వలసల తర్వాత శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయం ఇప్పుడు స్థానిక సంఘాల మద్దతుతో పునరుద్ధరించబడుతోంది.

Also Read :  ఆ వాహనాలకు రోడ్‌ ట్యాక్స్ ఉండదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Advertisment
తాజా కథనాలు