CJI: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బి. ఆర్ . గవాయి

జస్టిస్ భూషణ్ రామకృష్ఱ గవాయ్ సుప్రీంకోర్టు తరువాతి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈయన మే 14న సీఏఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నిన్న ఈ విషయాన్ని ప్రకటించారు. 

New Update
cji

NEW CJI B.R.Gavai

జస్టిస్ బీ ఆర్ గవాయి భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. ఈయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రైపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు అని  మేఘ్వాల్ అన్నారు. జస్టిస్ గవాయి సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన కేసులకు తీర్పులను ఇచ్చారు. జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అయితే..ప్రధాన న్యాయమూర్తి గవాయి..ఛీఫ్ జస్టిస్ గా కేవలం ఆరు నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ ఏడాది నవంబర్ లో ఆయన రిటైర్ అవనున్నారు.

22 ఏళ్ళుగా న్యాయవాద వృత్తిలో..

మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించిన జస్టిస్ గవాయ్, ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్ఎస్ గవాయ్ కుమారుడు. ఈయన 2003లో  బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబై, నాగ్‌పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్‌లకు నాయకత్వం వహిస్తూ 15 సంవత్సరాలకు పైగా సేవలందించారు. ఆ తరువాత మే 24, 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత 
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మర్నాడే  మే 14న గవాయ్ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  జస్టిస్ గవాయి కు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. బీ ఆర్ గవాయి నేతృత్వంలో న్యాయం మరింత అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఆశించారు. 

 today-latest-news-in-telugu | supreme-court | cji 

Also Read: Pakistan: యుద్ధానికి ప్రధాని ఫుల్ పర్మిషన్..పాకిస్తాన్ కు మొదలైన దడ

Advertisment
Advertisment
తాజా కథనాలు