OPERATION SINDOOR: నేడు నా కొడుకు ఆత్మకు శాంతి.. శుభం తండ్రి భావోద్వేగం!

పహల్గాం ఉగ్రదాడితో మృతి చెందిన శుభం ద్వివేది తండ్రి ఆపరేషన్ సింధూర్‌పై స్పందించారు. తన కొడుకు ఆత్మకు శాంతి లభించిందన్నారు. పహల్గాం దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ప్రధాని మోదీకి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.

New Update

ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అర్ధరాత్రి నిర్వహించిన ఈ వైమానిక దాడిలో భారత వైమానిక దళం సరిహద్దు దాటకుండానే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ పంజాబ్‌లోని 9 లక్ష్యాలను ధ్వంసం చేసింది. అయితే పహల్గాం ఉగ్రదాడిలో కాన్పూర్‌లోని శ్యామ్ నగర్‌కి చెందిన శుభం ద్వివేది కూడా బలి అయ్యాడు. శుభం ద్వివేది తండ్రి సంజయ్ ఈ దాడిపై స్పందించారు.

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

ఎలా నాశనం చేశారో..

ఉగ్రవాదులు తన కోడలి జీవితాన్ని ఎలా నాశనం చేశారో, నేడు భారత సైన్యం కూడా దానికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. శుభం ఆత్మకు ఈరోజు శాంతి లభించిందని తండ్రి భావోద్వేగం అయ్యారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదుల అందం ప్రారంభమైందని, మాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

పహల్గాం దాడికి పాల్పడిన దోషులు అందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పటి వరకు ఈ ఆపరేషన్ కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం మేం మాత్రమే కాదు, దేశం మొత్తం ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. తన కొడుకు మరణం ఎప్పటికీ బాధపెడుతుందని శుభం ద్వివేది తండ్రి అన్నారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు