OPERATION SINDOOR: ఆపరేషన్ సిందూర్.. పాక్‌కు చుక్కలు చూపించిన మిస్సైల్స్ ఇవే!

పాక్‌ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్‌ పేరుతో వైమానిక దాడులు నిర్వహించింది. అయితే HAMMER ప్రెసిషన్ బాంబ్, SCALP క్రూయిజ్ మిస్సైల్, లాయిటరింగ్ మ్యూనిషన్స్‌తో పాక్‌కు భారత్ చుక్కలు చూపించింది. రాఫిల్ యుద్ధ విమానాలతో వీటిని ఉపయోగించి దాడులు చేశారు.

New Update

ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లో వైమానిక దాడులు చేసింది. అర్థరాత్రి కొన్ని నిమిషాల పాటు పాక్‌కు భారత్ చుక్కలు చూపించింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చుక్కలు చూపించిన ఆ మిస్సైల్స్ ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్‌పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ

ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!

HAMMER ప్రెసిషన్ బాంబ్

ఈ బాంబు 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం గాలిలోనే కాకుండా భూమి మీద కూడా ఈ బాంబ్ వెళ్తుంది. కఠినమైన నిర్మాణాలను కూడా ఇది నాశనం చేస్తుంది. పరుగెడుతున్న వారిని కూడా టార్గెట్ చేసి ఎటాక్ చేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా ఈ బాంబులను ప్రయోగించారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!

SCALP క్రూయిజ్ మిస్సైల్

ఈ మిస్సైల్ ఎక్కువ దూరం వెళ్తుంది. దీన్ని ఎలాంటి రాడార్లు గుర్తించలేవు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీ వీటిని కనిపెట్టలేకపోయింది. ఇది దాదాపుగా 300 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. 

లాయిటరింగ్ మ్యూనిషన్స్

కామికేజ్ డ్రోన్లు అని పిలిచే ఇవి సరిగ్గా లక్ష్యాన్నే టార్గెట్ చేసి దాడి చేస్తాయి. ఈ ఆయుధాలను ఉపయోగించి బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు