భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వేడిక్కుతోంది. తీవ్రమైన ఉద్రిక్తతల నడుమ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత్ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, పంజాబ్, రాజస్తాన్లలో హై అలర్ట్ ప్రకటించింది. తాజాగా ఢిల్లీ నగరంలో హైఅలర్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఇండియా గేట్ వద్ధ అధిక సంఖ్యలో భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రవాణా వ్యవస్థను బంద్ చేశారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు
ఢిల్లీ నుంచి రైళ్లన్నీ బంద్
రైళ్లు, విమానాలు సహా మరిన్ని వాహనాలను నిలిపివేశారు. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి జమ్మూ వెళ్లే రైళ్లన్నింటినీ బంద్ చేశారు. వీటితోపాటు ఢిల్లీ నుంచి రాజస్థాన్, గుజరాత్ వెళ్లే వాహనాలను కూడా అధికారులు ఆపేశారు. అదే సమయంలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే దాదాపు 90 విమానాలను అనేక ఎయిర్లైన్స్ క్యాన్సిల్ చేశాయి.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
కాగా ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే 27 ఎయిర్పోర్టులను క్లోజ్ చేశారు. అదే సమయంలో దాదాపు 430కి పైగా విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇలా మొత్తం 46 దేశీయ ప్రయాణాలు, 33 రాకపోకలు క్యాన్సిల్ అయ్యాయి.
27 ఎయిర్పోర్టులు - 430 విమానాలు
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ - పాకిస్తాన్ మధ్య మరింత ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్లో మొత్తం 27 ఎయిర్పోర్టులను మూసివేశారు. అదే సమయంలో దాదాపు 430 విమానాలను రద్దు చేశారు. ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని సుమారు 27 ఎయిర్పోర్టులను మే 10వ తేదీ (శనివారం) వరకు క్లోజ్ చేశారు. అందులో ఇండిగో, స్పైస్ జెట్, అకాసా ఎయిర్, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సహా మరిన్ని విదేశీ విమానయాన సంస్థలు ఈ ఎయిర్పోర్టులకు రాకపోకలు సాగించే సర్వీసులను క్యాన్సిల్ చేసుకున్నాయి.
ఇది కూడా చూడండి: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
అదే సమయంలో భారత విమానయాన సంస్థలు దాదాపు 430 విమానాలను క్యాన్సిల్ చేశాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం నిలిపివేశాయి. ఈ మేరకు దానికి బదులుగా ముంబై, అహ్మదాబాద్ మీదుగా విమానాలను ‘రీరూట్’ చేయడానికి రెడీ అయ్యాయి.
ఇది కూడా చూడండి: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
ఈ ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు క్లోజ్
జమ్మూ, శ్రీనగర్, చండీగఢ్, లేహ్, అమృత్ సర్, పాటియాలా, లుధియానా, హల్వారా, బటిండా, భుంతర్, సిమ్లా, పఠాన్ కోట్, కిషన్ గఢ్, జైసల్మేర్, గగ్గల్, ధర్మశాల, ముంద్రా, జామ్ నగర్, జోధ్ ఫూర్, బికనీర్, రాజ్ కోట్, కేశోద్, భుజ్, పోర్ బందర్, కాండ్లా, హిందాన్, గ్వాలియర్ ఎయిర్పోర్టులను మే 10 వరకు టెంపరరీగా మూసివేశారు.
పాక్లో ఎయిర్పోర్టులు బంద్
మరోవైపు ఇండియా వరుసదాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. ఇండియా దాడి తర్వాత పాక్లో ఎయిర్పోర్టులు మూతపడ్డాయి. లాహోర్, కరాచీ ఎయిర్పోర్టులను పాకిస్తాన్ మూసివేసింది. రేపు ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల విమానాలు బంద్ అయ్యాయి.మరోవైపు పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటన జారీ అయింది.
operation Sindoor | latest-telugu-news | telugu-news | ind pak war | trains-cancelled