/rtv/media/media_files/2025/04/10/gaVw6i8rdXnyc4jcmcMS.jpg)
Nitish Kumar
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉప ప్రధాని అవుతారా అనే వార్తలు చర్చనీయాంశవుతున్నాయి. దీనికి కారణం బీజేసీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలే. మాజీ కేంద్రమంత్రి అయిన అశ్వినీ కుమార్ చౌబే తాజాగా మీడియాతో మాట్లాడారు. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ను తాను ఉప ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాని తెలిపారు. '' NDAకు నితీశ్ కుమార్ ఎంతో సేవ చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి ఆయనకు డిప్యూటీ పీఎం పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.
ఇలాంటిది జరిగిదే బీహార్ నుంచి ఆ స్థానానికి చేరిన రెండో వ్యక్తిగా నితీశ్ కుమార్ నిలుస్తారని'' అశ్వినీ కుమార్ చౌబే అన్నారు. అయితే గతంలో బీహార్ నుంచి ఉప ప్రధానమంత్రిగా బాబు జగ్జీవన్ రామ్ పనిచేశారు. ఇదిలాఉండగా ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నీతిశ్ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా నితీశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సీఎం పదవిపై ఆశతో ఆయన మళ్లీ కూటమి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read: మరో పరువు హత్య.. వేరే కులం వ్యక్తితో పారిపోయిందని కూతుర్ని హతమార్చిన తండ్రి
ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉంది. దీంతో ఆ పార్టీ నితీశ్ కుమార్ను పక్కన పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నితీశ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల మధ్య బీజేపీ నేత తాను నితిశ్ కుమార్ను డిప్యూటీ పీఎంగా చూడాలనుకుంటున్నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ఈదరు గాలులతో హైదరాబాద్ అతలాకుతలం