IND VS PAK: ఆపరేషన్ సిందూర్ మళ్ళీ సక్సెస్.. టీమ్ ఇండియా విక్టరీపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు.

New Update
modi-trump tariffs

PM Modi On Trump Tariffs

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు. ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్‌లో కూడా విజయవంతమైంది. రెండీట్లో ఫలితం ఒక్కటే.. భారత్ విజయం సాధించింది! మన క్రికెటర్లకు అభినందనలు" అని 'X'లో పోస్ట్ చేశారు.

ప్రధాని మోడీ తన ట్వీట్‌లో ప్రస్తావించిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్‌గా చేసింది.

పాకిస్తాన్‌పై గ్రౌండ్‌లో ఆసియా కప్ గెలవడాన్ని 'ఆపరేషన్ సింధూర్' విజయంతో పోల్చి ప్రధాని మోడీ ఓ బలమైన సందేశాన్ని పంపారు. క్రీడా రంగంలో లేదా రక్షణ రంగంలో... ఏ పోటీలోనైనా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోగలదనే గట్టి సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఈ ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించి, చివరి ఓవర్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత స్పిన్నర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు) పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఈ గెలుపుతో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని ప్రధాని మోడీ తన ప్రత్యేక శైలిలో అభినందించడం ద్వారా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

Advertisment
తాజా కథనాలు